Skip to main content

Posts

Showing posts from December, 2021

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని బీఫార్మసీ ప్రోగ్రామ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ( నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌) టైర్‌2 అక్రిడిటేషన్‌ సాధించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యూఢిల్లీ కేంద్రంగా ఏఐసీటీఈ అనుబంధంతో ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌కు సంబంధించిన తనీఖీ బృందం విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో 2021 సంవత్సరం నవంబర్‌ 27 నుంచి రెండు రోజుల పాటు పర్యటించిందన్నారు. తనీఖీ బృందం విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు అందించే విద్యా విధానం, సిలబస్‌ కంటెంట్, టీచింగ్‌ మెథడాలజీ, అకాడమిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, పబ్లికేషన్స్, ప్లేస్‌మెంట్స్, ఇంటర్న్‌షిప్స్, స్పోర్ట్స్, హాస్టల్‌ వసతి, విద్యార్థుల అచీవ్‌మెంట్స్, అత్యాధునిక ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌లన్నింటిని రెండు రోజులపాటు విస్తృతంగా పరిశీలించిందన్నారు.  విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవాలనే విద్యార్థులు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ను సాధించిన విజ్ఞాన్‌ ఫార్మసీ ...

నిలువెల్ల పాటై పూసిన గోరటి వెంకన్న..!!

(గోరటి వెంకన్నకు  కేంద్రసాహిత్య అకాడెమీ   పురస్కారం లభించిన సందర్భంగా….) * నిలువెల్ల పాటై పూసిన గోరటి వెంకన్న..!! *గోరటి వెంకన్న"… ఈ పేరు వినగానే పల్లె కన్నీరు గుర్తొస్తుంది. *గోరటి వెంకన్న అనగానే… జనం గుండె గోస వినిపిస్తుంది *తెలంగాణ తల్లి అరచేతి గోరింట గోరటోడి పాట.!! *గోరటి పాటల్లో స్వఛ్చమైన బతుకుంది. *గోరటిపాటల్లో నేలతల్లి పడే పురిటి నొప్పుల    బాధ వుంది. *గోరటి పాటల్లో కనుమరుగవుతున్న చేతివృత్తుల ఆర్తి వుంది. *గోరటి పాటల్లో గొంతెండిపోతున్న వాగుల ఘోష   వుంది . ఆ తాజ్ మహల్ అందాల కన్న.. నా వాగు పిచ్చుక గూళ్లే మిన్న”.. *గోరటి సామాజిక జీవి మాత్రమే కాదు.. సంచార జీవి కూడా.. ! *తోడేకొద్దీ ఊరే అనుభవాల మోట బావి   నీటి ఊట ఈ గోరటోడి పాట. *గోరటి  నిస్సందేహంగా ఈ యుగపు అసలు సిసలు ప్రాకృతిక కవి.! *నగరీకరణ మోజులో కొట్టుకు పోతున్న లోకానికి గోరటోడు…. పల్లె అందాల్ని పరిచయం చేస్తాడు. గోరటి వెంకన్న అనగానే.. అల సెంద్రవంక మన ముందు నిలుస్తుంది. గోరటి వెంకన్న అనగానే… జనం గుండె గోస వినిపిస్తుంది గోరటి వెంకన్న అనగానే… బతుకు పాట చిందులు తొక్కుతుం...

వినరా భారత వీరకుమారా విజయగాథ నేడు

బుర్రకథా కళాకారుడు : షేక్ నాజర్ వినరా భారత వీరకుమారా విజయగాథ నేడు, తందాన తాన. బుర్రకథ అనే మాట వినగానే మన కందరికీ గుర్తువచ్చే మొదటి పేరు షేక్ నాజర్. ఆంగ్లేయుల పాలనాకాలంలో, గుంటూరుజిల్లా పొన్నేకల్లు గ్రామంలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబములో షేక్ నాజర్ జన్మించేరు. షేక్ నాజర్ తండ్రిగారు తన కుటుంబములో నెలకొనియున్న దుర్భర ఆర్థిక పరిస్థితులను సహితము లెక్కచేయకుండా, తన పుత్రుడు మున్ముందు గొప్ప పేరుప్రఖ్యాతులు గడించాలనే గంపెడు ఆశతో షేక్ నాజర్‍ను పొన్నేకల్లులోని ప్రాథమిక పాఠశాలకు పంపించేరు. తనకుగల చిన్న పొలమునుండి వచ్చే అతితక్కువ రాబడికి తోడుగా సన్నాయి వాయిద్యముద్వారా సంపాదించినదానిలో అధిక మొత్తాన్ని కొడుకు చదువుకే వెచ్చించేవారు. ఆ పాఠశాలకు వచ్చిన ఒక స్కూల్‍ఇన్పెక్టర్ నాజర్‍లోని కళని గుర్తించి కొన్ని నాటకాలలో నటించే అవకాశం కల్పించేరు. ఆ నాటకాలలో హార్మోనియం వాయించే ఒక కళాకారుడు నాజర్‍ని బాలరత్న సభ అనే నాట్యమండలిలో చేర్చడంతో నాజర్‍కు రంగస్థల కళాకారుడు అవడానికి వీలు చిక్కింది. తొలుతగా నాజర్ అంత పిన్న వయసులోనే సంత్ కబీర్ దాస్ పాత్రను అద్భుతంగా పోషించేడు. ఆ నాట్య మండలి నెలకు ఇచ్చే పదిహేను రూప...

ఎ.పి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎంపిక

ఎ.పి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎంపిక  తెనాలి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి, వేమూరు నియోజకవర్గ నూతన కమిటి ఎంపిక ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు టి. రవీంద్రబాబు, కె. రత్నాకర్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బోస్ రోడ్ లోని ఫెడరేషన్ కార్యాలయంలో  డివిజన్ సమావేశ జరిగింది. నూతన తెనాలినియోజకవర్గ అధ్యక్షునిగా అంబటి శ్యామ్ సాగర్, ప్రధాన కార్యదర్శిగా పుట్లా పున్నయ్య లను సమావేశంఏకగ్రీవంగా ఆమోదించింది. అదేవిదంగా కోశాధికారిగా డి. కోటేశ్వరావు, ఉపాధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు, సహాయ కార్యదర్శిగా బి. చందు, కార్యవర్గ సభ్యులుగా డి. నాగరాజు, ఎన్.జెశ్యామ్యూల్, గుమ్మడి ప్రకాశావులు ఎంపికయ్యారు. వేమూరు నియోజక వర్గ అధ్యక్షునిగా మేకలసుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా ఆళ్ళ శేషిరెడ్డి, గౌరవ సలహాదారులుగా బి. సురేష్ బాబు, ఎస్.ఎన్జహీర్లను ఎంపికచేసారు. ఈ సందర్భంగా ప్రత్యేక కేక్ ను కట్ చేసారు. తమ ఎంపికకు కృషిచేసిన రవీంద్రబాబు, రత్నాకర్ లను నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. జర్నలి సంక్షేమానికి నిరంతరంకృషిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన...

1000 మంది విజ్ఞాన్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

1000 మంది విజ్ఞాన్‌ విద్యార్థులకు ఉద్యోగాలు గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 1000 మంది విద్యార్థులకు 1600 ఉద్యోగ అవకాశాలు లభించాయని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ప్రాంగణ ఎంపికల్లో  ప్రతిభ చూపిన విద్యార్థులకు గురువారం విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ ఒక్కొక్క విద్యార్థి రెండు నుంచి మూడు ఉద్యోగ అవకాశాలు సాధించటంతో పాటు రూ.15లక్షల వరకు వార్షిక వేతనం పొందనున్నారని వెల్లడించారు. యూనివర్సిటీలోని 75 శాతం మంది విద్యార్థులు నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ఉండగానే ఉద్యోగ అవకాశాలు సాధించారని పేర్కొన్నారు. ఉద్యోగాలు సాధించిన వారిలో 200 మందికి రూ.6.75 లక్షల నుంచి 15 లక్షల వార్షిక వేతనం, 600 మందికి రూ.4 లక్షల నుంచి రూ.6.75 లక్షల వార్షిక వేతనం, 800 మందికి రూ.3 లక్షల నుంచి 4 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు సాధించారని తెలియజేసారు. ప్రముఖ బహుళజాతి సంస్థలైన టీసీఎస్, సీటీఎస్, అసెంచర్, ఐబీఎమ్,...

విజ్ఞాన్స్‌ లారాతో ఐఐడీటీ– బ్లాక్‌బక్‌ కంపెనీ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ లారాతో ఐఐడీటీ– బ్లాక్‌బక్‌ కంపెనీ అవగాహన ఒప్పందం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలతో తిరుపతిలోని ఐఐడీటీ ( ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌) సౌజన్యంతో హైదరాబాద్‌లోని బ్లాక్‌బక్‌ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో బ్లాక్‌బక్‌ కంపెనీ ఎండీ, సీఈవో అనురాధ తోట, బ్లాక్‌బక్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ రాజ్‌ కుమార్‌ బోనగిరికు విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను అందజేసారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులకు ఇండస్ట్రీ నిపుణల చేత ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్‌ కోర్సులలో శిక్షణ ఇవ్వటమే కాకుండా ఇండస్ట్రీ లైవ్‌ ప్రాజెక్ట్‌ల మీద అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. దీని వలన ఇండస్ట్రీకు–అకడమియాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి విద్యార్థులను నేరుగా సంస్థల అవ...

విజ్ఞాన్స్‌ వర్సిటీ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు

విజ్ఞాన్స్‌ వర్సిటీ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌ ఆధ్వర్యంలో యూనివర్సిటీ దత్తగ్రామమైన వడ్లమూడి, గుంటూరు పట్టాభిపురంలోని అనురాగ్‌ ఓల్డేజ్‌ హోమ్‌లో  పలు సేవాకార్యక్రమాలు నిర్వహించామని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలోని పార్థ డెంటల్‌ క్లినిక్‌ వారి సహకారంతో వడ్లమూడి గ్రామంలోని 269 మందికి డాక్టర్‌ ఎండీ. మహమ్మద్‌ సోహెల్‌ ఆధ్వర్యంలో ఉచితంగా డెంటల్‌ చెకప్‌ను నిర్వహించామన్నారు. అంతేకాకుండా అవసరమైన వారికి మందులు, మౌత్‌ వాష్‌లను కూడా అందించారు.  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసీఈ ఆధ్వర్యంలో గుంటూరులోని పట్టాభిపురంలోని అనురాగ్‌ ఓల్డేజ్‌ హోమ్‌కు దుప్పట్లు అందజేసారు. కార్యక్రమంలో వడ్లమూడి గ్రామపంచాయతీ సర్పంచ్‌ అనితారాణి, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసీఈ విద్యార్థులు పాల్గొన్నారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జిల్లాల్లో సదస్సులు

రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జిల్లాల్లో సదస్సులు   - ఎపిడబ్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు పిలుపు  జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర సమాచార కమిషనర్ కు వినతిపత్రం అందజేత  టాలెంట్ ఎక్స్ ప్రెస్ విజయవాడ : రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్యుఈఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం విజయవాడ ఎంజి రోడ్డులోని రాకూర్ గ్రంథాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంజనేయులు మాట్లాడుతూ వచ్చే జనవరిలో జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అక్రడిటేషన్లు, రైల్వేపాస్ లు, హెల్త్ కార్డుల సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసే అన్ని కమిటీల్లో జర్నలిస్టులను యూనియన్లకు ప...

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌   విజ్ఞాన్‌ ఫార్మసీ– యూఎస్‌ఏలోని అవెనిద ఇన్నోవేషన్స్‌ల మధ్య అవగాహన ఒప్పందం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రాక్టీస్, యూఎస్‌ఏలోని అవెనిద ఇన్నోవేషన్స్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ది చేంజింగ్‌ వరల్డ్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘ఇంటర్న్‌షిప్‌ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌– దేర్‌ ఈస్‌ సమ్‌థింగ్‌ ఫర్‌ ఎవిరివన్‌’’అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూఎస్‌ఏ–కాలిఫోర్నియాలోని కార్డియోజెనిక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అశ్విని ధార్‌ మాట్లాడుతూ విద్యార్థులకు మెడికల్‌ ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ ఇన్ఫర్మేటిక్స్‌ అనేది సరికొత్త అధ్యయన రంగమని, ఇందులో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో పాటు కంప్యూటర్‌ సైన్స్‌ ఫార్మసీ పరిజ్ఞానాన్ని మిళితం చేయవచ్చునని పేర్కొన్నారు.  హెల్త్‌కేర్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ను మిళితం చేయడం వలన  రోగుల ఆరోగ్య సంరక్షణతో ...

రాజ్యాంగ విలువలను కాపాడాలి

రాజ్యాంగ విలువలను కాపాడాలి   భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు  భారత రాజ్యాంగ విలువలను కాపాడటం నేటి తరం విద్యార్థులు బాధ్యతని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో లా విద్యార్థులకు ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు విద్యార్థులకు ప్రాథమిక హక్కుల గురించి అవగాహన కల్పించాడు. గోప్యత హక్కు, తప్పనిసరి టీకా విధానాలు మరియు దాని రాజ్యాంగబద్ధత మొదలైన ప్రాథమిక హక్కులకు సంబంధించిన వివిధ సందర్భాలు మరియు సమస్యలను విద్యార్థులకు ప్రస్తావించాడు. అకాడమీ గోప్యత, న్యాయవ్యవస్థ స్వతంత్రత, న్యాయవ్యవస్థ, కేసుల పెండింగ్‌లు, మధ్యవర్తిత్వం మొదలైన అంశాలపై విద్యార్థులకున్న సందేహాలను జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నివృత్తి చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా – సివిల్‌ సర్వీసెస్‌ విద్యార్థులు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస...

సమాజానికి తిరిగి ఇవ్వాలి

సమాజానికి తిరిగి ఇవ్వాలి అమెరికాలోని తానా ప్రెసిడెంట్‌ లావు అంజయ్య చౌదరి విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగే క్రమంలో సేవ చేస్తూ వీలైనంత వరకు సమాజానికి తిరిగి ఇవ్వాలని అమెరికాలోని తానా( తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ప్రెసిడెంట్‌ లావు అంజయ్య చౌదరి పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ‘‘ ప్రాస్పెక్ట్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌– ఎంప్లాయిమెంట్‌ ఇన్‌ అమెరికా’’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమెరికాలోని తానా ప్రెసిడెంట్‌ లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు 3డీ ( డిసిప్లేన్, డిటర్మినేషన్, డెడికేషన్‌) ఫార్ములాను అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులందరూ మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని, కుటుంబ బంధాలను గౌరవిస్తూ నైతిక విలువలను పాటించాలని, సమాజానికి సేవ చేయాలని తెలియజేసారు. అనంతరం విద్యార్థులు యూఎస్‌కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన సెక్యూరిటీ టిప్స్‌ను వెల్లడించారు. విద్యార్థులు ఐ–20 డాక్యుమెంట్‌ను తప్పనిసరిగా పూర్తిచేయాలన్నారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత...

విజ్ఞాన్స్‌ వర్సీటీలో ఘనంగా సెమీ క్రిస్ట్‌మస్‌ వేడుకలు

విజ్ఞాన్స్‌ వర్సీటీలో ఘనంగా సెమీ క్రిస్ట్‌మస్‌ వేడుకలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో విద్యార్థుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  లేమన్స్‌ ఎవాంజిలికల్‌ ఫెలోషిప్‌కు చెందిన డాక్టర్‌ జాషువా  మాట్లాడుతూ జీవితంలో విద్యార్థులు భయానికి, ఆందోళనకు, ఒత్తిడికు గురికావద్దని పేర్కొన్నారు. కష్టకాలంలో దేవుడిని ప్రార్థించాలని, తొందరపడి క్షణికావేశంలో ఎటువంటి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోరాదన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టసుఖాలనేవి సాధారణమని, జీవితంలో చీకటి తర్వాత వెలుగులు కూడా నిండుతాయని తెలియజేసారు. జీవితంలో దేవుడు ఎప్పడు మీకు తోడుగా ఉంటాడని, మిమ్మల్ని సమున్నత స్థానాలకు తీసుకెళ్తాడని తెలియజేసారు. ఏసుక్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ఏసుక్రీస్తు ప్రపంచానికి అందించారన్నారు. ధర్మం కోసం అడుగులు వేసే ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారనేది క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుందని, సత్యాన్ని మానవాళికి ప్రకటించడంతో శాంతి, సహనాలను ప...

విజ్ఞాన్స్‌ లారాతో ఇంటర్నేషనల్‌ రివేచర్‌ కంపెనీ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ లారాతో ఇంటర్నేషనల్‌ రివేచర్‌ కంపెనీ అవగాహన ఒప్పందం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలతో చెన్నైలోని ఇంటర్నేషనల్‌ సంస్థ అయినటువంటి రివేచర్‌ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో రివేచర్‌ కంపెనీ హెచ్‌ ఆర్‌ డైరక్టర్‌ ఒఫిలియా అశోక్, క్యాంపస్‌ హైరింగ్‌ హెడ్‌ జేమ్స్‌ స్టీఫెన్‌లకు విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను అందజేసారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులు మూడో సంవత్సరంలో ఉండగానే కార్పొరేట్‌ ఎమ్‌ఎన్‌సీల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన తర్ఫీదును అందించి ఇన్ఫోసిస్, యూఎస్‌టీ గ్లోబల్, హెక్సా వేర్‌ వంటి కంపెనీలలో అత్యధిక వేతనం రూ.8 లక్షలతో నియామకం చేయటం జరుగుతుందన్నారు. ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులకు మాత్రమే కాకుండా అధ్యాపకులకు కూడా అత్యాధునిక టెక్నాలజీల గురించి అవగాహన కల్పించడం జరుగ...

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలి

కేంద్రం రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించండి అవసరమైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేర న్యాయపోరాటం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు త్వరలో ప్రభుత్వ విధాన నిర్ణయం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలి జాతీయ,రాష్ట్ర ఫెడరేషన్‌ నేతల డిమాండ్‌ విశాఖపట్నం,డిసెంబర్‌20: దేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని, అయితే వాటిని తక్షణమే తిరిగి పునరుద్దరించాలని కోరుతున్నామని ఏపీ వర్కింగ్‌ .జర్నలిస్టుల ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అంజనేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులు డిమాండ్‌ చేశారు. సోమవారం డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దేశ, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన అనేక అంశాలను వీరు వెల్లడించారు. కేంద్రం రద్దు చేసిన నాలుగు కార్మిక చట్టాల పునరుద్దరణ కోసం జాతీయ స్ధాయిలో అనేక ప్రాంతాల ప్రెస్‌క్లబ్‌లతో కలసి కృషి చేస్తున్నామన్నారు. పార్లమెంటరీ కమిటీ నివేదిక రాగానే ఆయా చట్టాలకు సంబంధించి స్ఫష్టత రాకపోతే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గద...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉద్భవ్‌–2కే21’

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉద్భవ్‌–2కే21’ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ మీట్‌ ‘ఉద్భవ్‌–2కే21’ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కైజెన్‌( కీ టు ఆంబీషియస్‌ అండ్‌ ఇంటెలెక్చుయల్‌ జోన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ నోవల్టీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరులోని ఐటీసీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ మధు వింజమూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మధు వింజమూరి  మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరని, కేవలం మార్కులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా విషయపరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు. కొత్త ప్రదేశం, కొత్త వ్యక్తులపై సహజంగా ఉండే భయాన్ని పోగొట్టి,  విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇనుమడింపచేసేందుకు ఇటువంటి స్నేహపూరితమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యా...

మానవాళి జీవితంలో వెలుగు నింపడానికి ఏసుక్రీస్తు అవతరించాడు

మానవాళి జీవితంలో వెలుగు నింపడానికి ఏసుక్రీస్తు గా ఈ ప్రపంచంలో అవతరించాడని జడ్పిటిసి పిల్లి ఉమా ప్రణతి , ఎంపీపీ చెన్ను బోయిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెనాలి శివారు మల్లెపాడు  రక్షణ కర్త ప్రార్థనా మందిరం లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కనపర్తి అబ్రహం లింకన్ అధ్యక్షత వహించారు నాయకులు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం మానవాళి రక్షణ కోసం ఏసుక్రీస్తు భూలోకంలో జన్మించారని, ఆయన మానవాళికి చూపిన మార్గం ఆచరణీయమని అన్నారు. రాజులను ఆశీర్వదించాలని బైబిల్ లో చెప్పారని, అయితే నేడు రాజులు అనేవారు పాలకులు అని వారిని ఆశీర్వదించాలని ప్రార్థనలో దేవుడిని కోరాలి  అన్నారు. ఆయన జన్మదినం ప్రపంచానికి మహాద్భుత క్రిస్మస్ రోజు అని చెప్పారు. ప్రజలకు ఏవైనా సమస్యలు వస్తే తమ వంతు గా సహకరిస్తామని తెలియజేశారు .ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు . 2022 నుండి పెన్షన్ను 2వేల500 వందలకు పెంచుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా నాయకు...

విద్యార్థికి లెర్నింగ్‌ నిరంతర ప్రక్రియ

విద్యార్థికి లెర్నింగ్‌ నిరంతర ప్రక్రియ   ఐఐఐటీ అలహాబాద్‌ డైరక్టర్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషన్‌   ఎన్‌ఈపీ–2020పై విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ప్రత్యేక ఉపన్యాసం విద్యార్థికి లెర్నింగ్, ట్యూటోరియల్‌ సెషన్, ప్రాక్టిస్‌/ ప్రాక్టికల్‌ అనే మూడు అంశాలు నిరంతర ప్రక్రియలని ఐఐఐటీ అలహాబాద్‌ డైరక్టర్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ‘‘ ట్రాన్స్‌ఫార్మింగ్‌ పాలసీ ఎన్‌ఈపీ–2020 ఇన్‌టు ప్రాగ్మాటిక్‌ రియాలిటీ ఇన్‌ ద పర్‌స్పెక్టివ్‌ ఆఫ్‌ టెక్నికల్‌’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐఐటీ అలహాబాద్‌ డైరక్టర్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషన్‌ మాట్లాడుతూ అధ్యాపకుడు విద్యార్థికి ప్రశ్న– జవాబు అనే విధానంలో బోధించకుండా వాటిని అర్థం చేసుకునే విధంగా బోధించాలన్నారు. విద్యార్థులు తమకున్న 24 గంటల సమయంలో కేవలం 8 గంటల సమయాన్ని లెర్నింగ్‌కు కేటాయించినట్లైతే అధ్బుతాలు సృష్టించవచ్చునన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియజేయాలన్నారు. విద్యార్థుల...

ఐవోటీతో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు

ఐవోటీతో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు   వారణాసిలోని షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ రాబోయే కాలంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ( ఐవోటీ)తో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని వారణాసిలోని షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘‘ ఐఈఈఈ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఐవోటీ ఫర్‌ రూరల్‌ హెల్త్‌కేర్‌ ( సీఐఆర్‌హెచ్‌–2021)’’ అనే అంశంపై 3 రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారణాసిలోని షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి మాట్లాడుతూ విద్యార్థులు డిస్కవరీ, ఇన్వెన్షన్, ఇన్నోవేషన్‌ అనే మూడు అంశాలపై దృష్టిసారించాలన్నారు. ఐవోటీ సహాయంతో ఆరోగ్య రంగంలో సామాన్య ప్రజల ఆరోగ్య పర్యవేక్షణ, రక్తపోటు, హార్ట్‌ రేటులను మానిటరింగ్‌ చేయవచ్చునన్నారు. అంతేకాకుండా హాస్పిటల్‌ అడ్మిట్‌ అయిన రోగి కదలికలను కూడా గమనించవచ్చని తెలియ...

16 నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

16 నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 18వ తారీఖు వరకు ( 3 రోజుల పాటు)  అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన బ్రౌచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ ‘‘ ఐఈఈఈ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఐవోటీ ఫర్‌ రూరల్‌ హెల్త్‌కేర్‌ ( సీఐఆర్‌హెచ్‌–2021)’’ అనే అంశంపై 3 రోజుల పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎస్‌ఈఎస్‌ఈఐ డైరక్టర్‌ దినేష్‌ చాంద్‌ శర్మ, షార్‌ మాజీ డైరక్టర్, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్, షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి, ఆసియా– పసిఫిక్‌ 10వ ఐఈఈఈ రీజియన్‌ డైరక్టర్‌ ఈఆర్‌.దీపక్‌ మథూర్, యూఎస్‌ఏలోని యూసీ మాజీ డైరక్టర్, ప్రొఫెసర్‌ సారహ్‌ కుర్ట్‌›్జ, ...

సినిమా ప్రొడక్షన్ ప్యాకేజి కోసం..

డాక్టర్ పిల్లి వాసు కు నన్నయ విద్యాపీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం

డాక్టర్ పిల్లి వాసు కు నన్నయ విద్యాపీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం   స్థానిక తెనాలి ఐతానగర్ కు చెందిన డా॥ పిల్లి వాసు కు నన్నయ విద్యాపీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డి.యన్, ఆర్ కళాశాల ఏ.జి కోర్సెస్ తెలుగుశాఖ మరియు నన్నయ విద్యాపీఠం వారు సంయుక్తంగా ఈ నెల 11 వ తేదీన నిర్వహించిన సభా కార్యక్రమంలో ఈ పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా భీమవరం డి.యన్. ఆర్ కళాశాలలోని ఆచార్య కలిదిండి సీతారామరాజు గారి స్మారక సమావేశ మందిరమైన సెమినార్ హాల్ లో, అనేక పుస్తకావిష్కరణల మధ్య జరిగిన మైత్రి సదస్సు కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యుల మేడిపల్లి రవికుమార్, ఆచార్య రేమిళ్ళ బెంకట కృష్ణశాస్త్రి, ఆచార్య యార్లగడ్డ రామకృష్ణ, మరియు దా॥ యండపల్లి పాండురంగ ప్రాధార్యులు ,పండితులు మరియు భాషాభిమానులందరి సమక్షంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారా వెలువరించిన ఉత్తమ పరిశోధనలకు గాను, డా|| పిల్లి వాసు ను ఈ విశిష్ట ప్రతిభా పురస్కారంతో సత్కరించారు.  డాక్టర్. పిల్లి వాసు గతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ జాతీయ సేవా పురస్కారా...

ఉద్యోగాలు, పరిశోధనలకు పెద్దపీట

ఉద్యోగాలు, పరిశోధనలకు పెద్దపీట   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌   విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల   అన్ని విజ్ఞాన్‌ కార్యాలయాల్లో అందుబాటులో దరఖాస్తులు    ఏప్రిల్‌ 25 నుంచి 30 వరకు బీటెక్‌/బీఫార్మసీ ప్రవేశ పరీక్ష   వీశాట్‌–2022 దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 20   దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు   ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు   వీశాట్‌–2022 ప్రధాన అంశాలు ఇవే యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశోధనలకు పెద్ద పీట వేయడం... లాంటి సమున్నత లక్ష్యాలతో తాము ముందుకెళుతున్నామని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ సోమవారం తెలిపారు.   విజ్ఞాన్‌ యూనివర్సిటీ 2022–23 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీహెచ్‌డీ అడ్మిషన్ల (వీశాట్‌ – 2022) నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. ఈ...

ఫెడరేషన్ నేతలు రఘురామయ్య,రవీంద్ర లకు సత్కారం

ఫెడరేషన్ నేతలు రఘురామయ్య,రవీంద్ర లకు  సత్కారం ------------------------------ తెనాలి డిసెంబరు 10: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం చెంచుపేటలో ఇండియన్ పీస్  కార్యాలయం లోబిషప్ ప్రవీణ్ వర్మ ఆధ్వర్యంలోశుక్రవారం సమాజంలో విశిష్ట సేవలందించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి.రవీధ్రబాబు,గౌరవ అధ్యక్షులు కె.రఘురామయ్య లను సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ యస్.పి.థియోఫిలస్, రిటైర్డ్ టీచర్ చిలకా జాన్ ప్రసాద్, పినపాటి సురేష్, సునీల్ లు మాట్లాడుతూ  అంబేద్కర్ రూపొందించిన చట్టాలు కచ్చితంగా అమలుచేసి బలహీనులకు రక్షణ కల్పించాలని కోరారు.  ఎ.పి.ఎస్సీ కమీషన్ మెంబర్ బసవరాజు మాట్లాడుతూ ఒకవ్యక్తి స్వేచ్చను హరించటం ,భంగం కలిగించటం చేయ కూడదన్నారు.ప్రజలమధ్య ఐక్యత పాటించాలన్నారు.పౌరులు అహం, గర్వానికి దూరంగా ఉండాలన్నారు. నీలిమ అజయ్ మాట్లాడుతూ హక్కులు తెలుసుకుని వాటిని సాధించుకోవటం ద్వారా బలపడతామన్నారు.హిందు పత్రిక ప్రతినిధి శామ్యూల్ జనార్ధన్, ఫెడరేషన్ సభ్యులు ప్రకాశరావు, పి. పున్నయ్య, జీ. ప్రేమ్...

సేవా భారతి పురస్కారం అందుకున్న యువనటుడు మధుకర్

సేవా భారతి పురస్కారం అందుకున్న యువనటుడు మధుకర్  మానవ హక్కుల సంఘం చైర్మన్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మధుకర్ తెనాలి:  పట్టణానికి చెందిన యువనటుడు, న్యాయవాది కనపర్తి మధుకర్ సేవా భారతి పురస్కారాన్ని అందుకున్నారు. నటన విభాగం లో ఉత్తమ నటునిగా మధుకర్ ను గుర్తించి ఈ పురస్కారాన్ని  ప్రపంచ మానవ హక్కుల సంఘం ప్రధానం చేసింది. శుక్ర వారం నెల్లూరులో జరిగిన ప్రపంచ మానవ హక్కు దినోత్సవం వేడుకల్లో  భాగం గా జరిగిన ప్రదానోత్సవం లో  పలు రం గాల్లో ఉత్తమ సేవలు అందించిన వారిని ఎంపిక చేసి అవార్డులను సంస్థ డైరెక్టర్ సుబ్బారెడ్డి,  సభ్యులు అందించారు. వృత్తి రీత్యా అడ్వకేట్ అయిన మధుకర్ కళా రంగపై ఉన్న ఇష్టంతో నాటకాలు, సినిమాలలో నటించాడు. రంగస్థల కళ ద్వారా పలు ఉత్తమ నాటకాల్లో నటించి ప్రజలను చైతన్యవంతం చేశారు. నాటకాల్లో నటించడం తో పాటు టీవీ, సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా మధుకర్ ను కళారంగ ప్రముఖులు, కళా సంస్థల నిర్వాహకులు,  పట్టణ ప్రమఖులు, కళాభిమాలు అభినందించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి.        - ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి సందర్భంగా గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయమైన సామాజిక న్యాయాన్ని సాధించటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవిరళ కృషి  చేస్తున్నారని తెలిపారు.బడుగు బలహీన వర్గాల వారికి 50 శాతంకు పైగా నామినేటెడ్ పదవులలో  అవకాశం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం సామాజిక అసమానతలను రూపుమాపటానికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన  డా" బి.ఆర్ అంబేద్కర్ ను భారత సమాజం నిరంతరం స్మరించుకుంటుందన్నారు.గత 70 సంవత్సరాల కాలంలో దళితుల ప...

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 65వ వర్ధంతి సభలో పాల్గొన్న హోమ్ మినిస్టర్

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 65వ వర్ధంతి సభలో పాల్గొన్న హోమ్ మినిస్టర్  గుంటూరు నగరంలోని లాడ్జ్ సెంటర్ నందలి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్న ను రాష్ట్ర హోం శాఖమాత్యులు మేకతోటితోటి సుచరిత, గుంటూరు నగర పాలక సంస్థ మేయర్  కావటి శివ నాగ మనోహర్ నాయుడు లు ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్ర బాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ ,డైరెక్టర్లు, నగరంలోని వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు, వైయస్సార్ సిపి ముఖ్య నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మార్చి 25న

రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మార్చి 25న  రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం  రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 25, 2022న థియేట‌ర్స్‌లో విడుద‌ల‌కానుంది.  దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా... సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌.

డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ జయంతి మన కర్తవ్యాలు

Dr. B.R. అంబేద్కర్ 130 వ జయంతి మన కర్తవ్యాలు — రేకా చంద్ర శేఖర రావు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాసంగికత, అవసరత సమాజానికి గత 35 సంవత్సరాల నుండి- 1985 కారంచేడు నుండి- పెరుగుతూ వస్తున్నది. ఈ రోజు ఏ శక్తులు అంబేద్కర్ ను కాదన గలిగిన పరిస్తితిలో లేవు.  Dr. B.R. అంబేద్కర్ తన శతృవుగా భావించి మను వాదంపై తీవ్ర పోరాటాలు చేశాడు. అలాటి మనువాద సిద్దాంత కర్తల పార్టీ నేడు అధికారంలో వుంటూ కూడా అంబేద్కర్ ని  మాటలలో తృణీకరించకుండా  జయంతులు, వర్ధంతుల సందర్భంలో ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. అంబేద్కర్ లాగా తమ సిద్దాంతాలతో ఏ మాత్రం పొసగని షహీద్ భగత్ సింగ్ జయంతి , వర్ధంతులు కూడా అలాగే జరుపుతున్నారు. అంబేద్కర్, భగత్ సింగులపైన వారు ప్రదర్శించే  ప్రేమలోని బూటకత్వాన్ని ఎండగట్ట వలసిన అవసరం నేడు ఎంతో వుంది. అంబేద్కర్ ఒక దార్శనికుడు . కుల నిర్మూలన సిద్దాంత వేత్తగానే గాకుండా రాజ్యాంగ రచనలో కూడా కీలక పాత్ర నిర్వహించాడు.  వయోజన ఓటింగు, భావ ప్రకటనా స్వేఛ్చ, రాష్ట్రాల అధికారాలు , న్యాయ వ్యవస్తకు అత్యున్నత అధికారాలు ఇవ్వడం , మహిళలకు సమాన హక్కులు, దళిత , ఆదివాసీ వెనకబడిన వర్గాలకు ప్ర...

యాడ్

టెక్నీకల్ డ్రాయింగ్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు

టెక్నీకల్ పరీక్షలు డ్రాయింగ్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు  టాలెంట్ ఎక్స్ ప్రెస్:  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  నిర్వహించిన టెక్నికల్ పరీక్షలు డ్రాయింగ్ లోయర్ మరియు హయ్యర్ పరీక్షలలో సృష్టి ఆర్ట్ అకాడమీ విర్యార్థులు విజయం సాధించినట్లు సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు తిమ్మిరి రవీంద్ర ఒక ప్రకటన లో తెలిపారు. హయ్యర్ లో సింగంశెట్టి విగ్నేష్ అంజన్ , నాయుడు చందు,పాలేటి శిరీష, ఒంగోలు ఉమామహేశ్వరీ , మిట్నసల దీప్తి, తాళ్లూరి లక్ష్మి ధృతి , బర్తేపూడి శ్రీ శ్వేత, ఉతీర్ణత సాధించగా లోయర్ లో దారా జ్యోత్స్నా , చోడా అభిరాం , గుండాల వెంకట సాయి సిరోష్, విజయం సాధించారు. ఈ సందర్భముగా చిత్రకళా విద్యార్థినీ విద్యార్థులను సృష్టి ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు తిమ్మిరి రవీంద్ర ,  నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.భాను చందర్, తూనుగుంట నాగమణి , సింగమనేని సురేష్ బాబు , డైమండ్ 9 సెక్యూరిటీస్ మేనేజింగ్ పార్ట్నర్ డి.బి కోటేశ్వరరావు, పలువురు చిత్రకారులు అభినందించారు. .

new film production house

సృజన ప్రతిభా పురస్కారం అందుకున్న రచయిత్రి కోడె యామిని

సృజన ప్రతిభా పురస్కారం అందుకున్న రచయిత్రి కోడె యామిని   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రముఖ రచయిత్రి కోడె యామిని దేవి నెల్లూరుకు చెందిన సాహిత్య, సాంస్కృతిక వేదిక సంస్థ సృజన ప్రతిభా పురస్కారం అందుకున్నారు. నెల్లూరులోని మురళీకృష్ణ హాస్పటల్ ప్రాగణంలో ఆదివారం జరిగిన ఘంటసాల జయంతి వేడుక సభలో యామిని దేవి సంస్థ నిర్వహకులు ఈ పురస్కారాన్ని అందజేసారు. సంస్థ అధ్యక్షులు దగ్గుపాటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన సృజన సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. యామినిదేవితో పాటు శాస్త్రీయ నృత్య గురువు వి. సంధ్యా శేఖర్, సినీ సంగీత పోటీల్లో సీనియర్ విభాగంలో పాల్గొని విజేతలుగా నిలిచిన శ్రీనివాసమూర్తి, యం. చక్రపాణి, యన్. వి సుబ్బయ్యలను సత్కరించారు. జూనియర్ విభాగంలో విజేతలు లోహిత్ రెడ్డి, వైష్ణవి, శరణ్యలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సమాఖ్య నెల్లూరు ప్రాంత అధ్యక్షులు నలుబోలు బలరామయ్య నాయుడు,  డాడీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ కె. ఆనందరావు, సీనియర్ గాయకులు, న్యాయవాది మరుధూరి రామకృష్ణ, టి.వి రత్నం, మనం ఫౌండేషన్ చైర్మన్ పనం ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీఎస్టీ–ఎస్టీఐ హబ్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీఎస్టీ–ఎస్టీఐ హబ్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి న్యూఢిల్లీ నుంచి మంజూరైన డీఎస్టీ–ఎస్టీఐ హబ్‌ ప్రాజెక్టు పనులను గుంటూరు జిల్లాలోని క్రోసూరు మండలంలో ప్రారంభించామని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా క్రోసూరులో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యూఢిల్లీలోని ఐసీఏఆర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఓ.ఎన్‌.తివారీ, క్రోసూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ వి.జ్వాలా లక్ష్మి నరసింహారావు, జిల్లా ఫార్మర్స్‌ అసోసియేషన్‌ మెంబర్‌ అనుముల శ్రీనివాస రెడ్డి  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ ఓ.ఎన్‌.తివారీ మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ మరియు న్యూఢిల్లీలోని డీఎస్టీ–ఎస్టీఐ హబ్‌ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల ప్రజల ఆదాయ అభివృద్ధిని, జీవనోపాధి మెరుగుదల కోసం ఈ ప్రాజెక్టును  ప్రారంభిస్తున్నామని తెలియజేసారు. ఈ ప్రాజెక్టు ద్వారా పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సాంకేతికతను అలవాటు...

ప్రకృతి పరిమళాలు వెదజల్లుతున్న ప్రసన్న జ్యోతి చిత్రాలు

ప్రకృతి పరిమళాలు వెదజల్లుతున్న ప్రసన్న జ్యోతి చిత్రాలు  - కుంచెతో అద్భుత చిత్రాల సృష్టి  - వైవిధ్యం, సృజనాత్మకత ఆమె చిత్రాల సొంతం  - చిత్ర కళలో రాణిస్తున్న యువ   చిత్రకారిణి  టాలెంట్ ఎక్స్ ప్రెస్: పరిశీలన, పరిశోధన, అణ్వేషణతో అమె కుంచెకు రంగులు అద్ది అద్భుత కళాకండాలను చిత్రిస్తారు. విభిన్నంగా ఆలోచన చేసి చిత్ర రచన చేసి వహవా అనిపించుకుంటారు. ప్రత్యేకంగా ప్రకృతిపై, పర్యావరణం పై రూపొందించిన కోట ప్రసన్న జ్యోతి చిత్రాలు ఆలోజింపచేస్తాయి. హైదరాబాద్ కు చెందిన ప్రసన్న జ్యోతి ఏడో యేటనుంచే చిత్రకళపై మక్కువ పెంచుకుంది. తల్లి సుమలత ప్రోత్సాహంతో చిత్రకళలో ఫైన్ ఆర్ట్స్ పూర్తిచేసి చిత్రకళా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అలవోకగా ప్రకృతి రమణీయత ఉట్టిపడే, చూడగానే రెప్పలార్పకుండా చూడాలనిపించే లాండ్ స్కేప్ లు, భక్తిపరవశంలో ముంచెత్తే దేవతా మూర్తుల చిత్రాలు, పోర్టెట్స్, మాతృప్రేమ మూర్తీభవించే తల్లి,  పిల్లల చిత్రాలు తన కుంచెలతో పురుడుపోసుకుంటాయి.  సహజత్వంతో ఈ చిత్రకారిణి రూపొందించిన చిత్రాలన్నీ అందమైన దృశ్యకావ్యాలే. తొలినాళ్ళలో లైన్ డ్రాయిం...