రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మార్చి 25న
రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్లు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 25, 2022న థియేటర్స్లో విడుదలకానుంది.
దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా... సత్యన్ సూర్యన్ కెమెరామెన్గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్.