Skip to main content

ఫెడరేషన్ నేతలు రఘురామయ్య,రవీంద్ర లకు సత్కారం

ఫెడరేషన్ నేతలు రఘురామయ్య,రవీంద్ర లకు  సత్కారం
------------------------------



తెనాలి డిసెంబరు 10: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం చెంచుపేటలో ఇండియన్ పీస్  కార్యాలయం లోబిషప్ ప్రవీణ్ వర్మ ఆధ్వర్యంలోశుక్రవారం సమాజంలో విశిష్ట సేవలందించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి.రవీధ్రబాబు,గౌరవ అధ్యక్షులు కె.రఘురామయ్య లను సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ యస్.పి.థియోఫిలస్,
రిటైర్డ్ టీచర్ చిలకా జాన్ ప్రసాద్, పినపాటి సురేష్, సునీల్ లు మాట్లాడుతూ  అంబేద్కర్ రూపొందించిన చట్టాలు కచ్చితంగా అమలుచేసి బలహీనులకు రక్షణ కల్పించాలని కోరారు.  ఎ.పి.ఎస్సీ కమీషన్ మెంబర్ బసవరాజు మాట్లాడుతూ ఒకవ్యక్తి స్వేచ్చను హరించటం ,భంగం కలిగించటం చేయ కూడదన్నారు.ప్రజలమధ్య ఐక్యత పాటించాలన్నారు.పౌరులు అహం, గర్వానికి దూరంగా ఉండాలన్నారు. నీలిమ అజయ్ మాట్లాడుతూ హక్కులు తెలుసుకుని వాటిని సాధించుకోవటం ద్వారా బలపడతామన్నారు.హిందు పత్రిక ప్రతినిధి శామ్యూల్ జనార్ధన్, ఫెడరేషన్ సభ్యులు ప్రకాశరావు, పి. పున్నయ్య, జీ. ప్రేమ్ కుమార్, శ్యామ్యుల్, జహీర్, శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, శ్రీ శ్రీ మీడియా శ్రీకాంత్, రవి కిరణ్, పలువురు పాత్రికేయులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. పాత్రికేయులుగా సమాజం లోని పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించడం లో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న పాత్రికేయులు రవీంద్ర బాబు, రఘు రామయ్యలను అభినందించారు. సత్కార గ్రహీతలు మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యవంతం చేయడం లో పాత్రికేయుల పాత్ర ప్రముఖమైనదన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...