డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి.


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి.

       - ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి సందర్భంగా గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయమైన సామాజిక న్యాయాన్ని సాధించటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవిరళ కృషి  చేస్తున్నారని తెలిపారు.బడుగు బలహీన వర్గాల వారికి 50 శాతంకు పైగా నామినేటెడ్ పదవులలో  అవకాశం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం సామాజిక అసమానతలను రూపుమాపటానికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన  డా" బి.ఆర్ అంబేద్కర్ ను భారత సమాజం నిరంతరం స్మరించుకుంటుందన్నారు.గత 70 సంవత్సరాల కాలంలో దళితుల ప్రగతికి ప్రధాన భూమికగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి తోడ్పడిందని పేర్కొన్నారు.