Skip to main content

ఐవోటీతో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు

ఐవోటీతో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు

  వారణాసిలోని షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి


  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

రాబోయే కాలంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ( ఐవోటీ)తో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని వారణాసిలోని షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘‘ ఐఈఈఈ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఐవోటీ ఫర్‌ రూరల్‌ హెల్త్‌కేర్‌ ( సీఐఆర్‌హెచ్‌–2021)’’ అనే అంశంపై 3 రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారణాసిలోని షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి మాట్లాడుతూ విద్యార్థులు డిస్కవరీ, ఇన్వెన్షన్, ఇన్నోవేషన్‌ అనే మూడు అంశాలపై దృష్టిసారించాలన్నారు. ఐవోటీ సహాయంతో ఆరోగ్య రంగంలో సామాన్య ప్రజల ఆరోగ్య పర్యవేక్షణ, రక్తపోటు, హార్ట్‌ రేటులను మానిటరింగ్‌ చేయవచ్చునన్నారు. అంతేకాకుండా హాస్పిటల్‌ అడ్మిట్‌ అయిన రోగి కదలికలను కూడా గమనించవచ్చని తెలియజేసారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇలాంటి కాన్ఫరెన్స్‌లు ఉపయోగపడుతాయని అన్నారు. ఉజ్వల భవిష్యత్‌ కోసం ఒకరికొకరు ప్రోత్సాహాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ సాధ్యమని అన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సిలికాన్‌ ల్యాబ్స్‌ ఇంజినీరింగ్‌ సీనియర్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ ఐవోటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవాలనే విద్యార్థులు మెషిన్‌ లెర్నింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్, ప్రోగ్రామింగ్, అనలిటిక్స్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌తో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌ ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్‌ డివైస్‌ల డిజైనింగ్‌ కోసం ఆటోక్యాడ్‌ టెక్నాలజీ అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. అనంతరం అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన సీడీను ఆవిష్కరించారు. విజయవాడలోని ఎప్ఫాట్రానిక్స్‌ ఎండీ డీ.రామక్రిష్ణ మాట్లాడుతూ స్మార్ట్‌ డివైసెస్, స్మార్ట్‌ హోమ్స్, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్, రోబోటిక్స్‌ వంటి రంగాలు వేగంగా విస్తరిస్తుండటం వలన ఐవోటీలో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని వెల్లడించారు. డిజిటల్‌ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకు సరికొత్త పుంతలు తొక్కుతుందన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం మన దైనందిన జీవితాలను మరింత సౌకర్యవంతం చేస్తుందన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...