Skip to main content

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలి

కేంద్రం రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించండి
అవసరమైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేర న్యాయపోరాటం
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు త్వరలో ప్రభుత్వ విధాన నిర్ణయం
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలి
జాతీయ,రాష్ట్ర ఫెడరేషన్‌ నేతల డిమాండ్‌


విశాఖపట్నం,డిసెంబర్‌20: దేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని, అయితే వాటిని తక్షణమే తిరిగి పునరుద్దరించాలని కోరుతున్నామని ఏపీ వర్కింగ్‌ .జర్నలిస్టుల ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అంజనేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులు డిమాండ్‌ చేశారు. సోమవారం డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దేశ, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన అనేక అంశాలను వీరు వెల్లడించారు. కేంద్రం రద్దు చేసిన నాలుగు కార్మిక చట్టాల పునరుద్దరణ కోసం జాతీయ స్ధాయిలో అనేక ప్రాంతాల ప్రెస్‌క్లబ్‌లతో కలసి కృషి చేస్తున్నామన్నారు. పార్లమెంటరీ కమిటీ నివేదిక రాగానే ఆయా చట్టాలకు సంబంధించి స్ఫష్టత రాకపోతే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం న్యాయ పోరాటం చేసే అంశాన్ని తమ యూనియన్‌లు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చి ఉన్నందున దాని కోసం తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సానుకూలంగా  ప్రకటన వెలువడుతుందని తాము భావిస్తున్నామన్నారు. అక్రిడేషన్లుకు సంబంధించి దశల వారీగా జారీ చేస్తున్నారని, చిన్న పత్రికలకు, కేబుల్‌టీవీలకు సైతం అక్రిడేషన్లు జారీ అవుతున్నాయని,ఈ ప్రక్రియలో ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. దేశంలో, రాష్ట్రంలో మీడియా కమిషన్‌లు ఏర్పాటు చేస్తే జర్నలిస్టులకు సంబంధించిన విధివిధానాల ప్రకారం అందరూ ఒకే రీతిన పనిచేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. దీంతో పాటు శరవేగంగా పెరుగుతున్న డిజిటల్‌ మీడియాకు సంబంధించి కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన మేర మార్గదర్శకాలు జారీ చేయాలని వీరు కోరారు. కేంద్రం విధివిధానాల బట్టి రాష్ట్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్‌,బ్రాడ్‌కాస్ట్‌ యూనియన్లును మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇప్పటికే ఈ రెండు యూనియన్లుకు ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా గుర్తింపు లభించిందని వివరించారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి తమ పరిధి మేరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఆయా సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ అర్భన్‌ యూనిట్‌ అధ్యక్షుడు పి. నారాయణ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు జాతీయ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఈ నెల 23న రాష్ట్రస్ధాయి సమావేశం జరగనుందని, అందులో పలు అంశాలను చర్చించేందుకు నివేదిక అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్‌ జాతీయ సభ్యుడు జి.శ్రీనివాసరావు, అర్భన్‌ యూనిట్‌ కార్యదర్శి అనురాధ, బ్రాడ్‌కాస్ట్‌ సంఘం ప్రతినిధులు రామకృష్ణ, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, పాల్గొన్నారు. తదుపరి పలువురు జర్నలిస్ట్ లు ఆంజనేయులు ను ఘనముగా సత్కరించారు...

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...