Skip to main content

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌


  విజ్ఞాన్‌ ఫార్మసీ– యూఎస్‌ఏలోని అవెనిద ఇన్నోవేషన్స్‌ల మధ్య అవగాహన ఒప్పందం

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రాక్టీస్, యూఎస్‌ఏలోని అవెనిద ఇన్నోవేషన్స్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ది చేంజింగ్‌ వరల్డ్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘ఇంటర్న్‌షిప్‌ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌– దేర్‌ ఈస్‌ సమ్‌థింగ్‌ ఫర్‌ ఎవిరివన్‌’’అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూఎస్‌ఏ–కాలిఫోర్నియాలోని కార్డియోజెనిక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అశ్విని ధార్‌ మాట్లాడుతూ విద్యార్థులకు మెడికల్‌ ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ ఇన్ఫర్మేటిక్స్‌ అనేది సరికొత్త అధ్యయన రంగమని, ఇందులో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో పాటు కంప్యూటర్‌ సైన్స్‌ ఫార్మసీ పరిజ్ఞానాన్ని మిళితం చేయవచ్చునని పేర్కొన్నారు.  హెల్త్‌కేర్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ను మిళితం చేయడం వలన  రోగుల ఆరోగ్య సంరక్షణతో పాటు మెరుగైన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. అంతేకాకుండా క్లినికల్‌ డెసిషన్‌ సపోర్ట్‌ సిస్టమ్‌లను రూపొందించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న  డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్‌ రంగాల పైన దృష్టిసారించి, వాటిపై పట్టు సాధించినట్లైతే అపార అవకాశాలతో పాటు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం విజ్ఞాన్‌ ఫార్మసీ– యూఎస్‌ఏలోని అవెనిద ఇన్నోవేషన్స్‌ల మధ్య అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య యూఎస్‌ఏ–కాలిఫోర్నియాలోని కార్డియోజెనిక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అశ్విని ధార్‌కు అందజేసారు. ఈ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణను ఇవ్వడంతో పాటు ప్రముఖ బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని  వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో లీడర్‌షిప్‌ స్కిల్స్‌ అండ్‌ ఫార్మసీ ఇన్ఫార్మాటిక్స్‌ వర్క్‌షాప్, రోల్‌ ఆఫ్‌ ఫార్మాసిస్ట్‌ ఇన్‌ చేంజింగ్‌ వరల్డ్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్, హెల్త్‌కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్, వరల్డ్‌ ఆఫ్‌ ఆపర్చునిటీస్‌ ఫర్‌ క్లినికల్‌ ఫార్మాసిస్ట్స్‌ అనే నాలుగు అంశాలపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్, డీన్‌ అకడమిక్స్‌ జీ.సతీష్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...