Skip to main content

ప్రకృతి పరిమళాలు వెదజల్లుతున్న ప్రసన్న జ్యోతి చిత్రాలు

ప్రకృతి పరిమళాలు వెదజల్లుతున్న ప్రసన్న జ్యోతి చిత్రాలు
 - కుంచెతో అద్భుత చిత్రాల సృష్టి
 - వైవిధ్యం, సృజనాత్మకత ఆమె చిత్రాల సొంతం 
- చిత్ర కళలో రాణిస్తున్న యువ   చిత్రకారిణి 


టాలెంట్ ఎక్స్ ప్రెస్: పరిశీలన, పరిశోధన, అణ్వేషణతో అమె కుంచెకు రంగులు అద్ది అద్భుత కళాకండాలను చిత్రిస్తారు. విభిన్నంగా ఆలోచన చేసి చిత్ర రచన చేసి వహవా అనిపించుకుంటారు. ప్రత్యేకంగా ప్రకృతిపై, పర్యావరణం పై రూపొందించిన కోట ప్రసన్న జ్యోతి చిత్రాలు ఆలోజింపచేస్తాయి. హైదరాబాద్ కు చెందిన ప్రసన్న జ్యోతి ఏడో యేటనుంచే చిత్రకళపై మక్కువ పెంచుకుంది. తల్లి సుమలత ప్రోత్సాహంతో చిత్రకళలో ఫైన్ ఆర్ట్స్ పూర్తిచేసి చిత్రకళా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అలవోకగా ప్రకృతి రమణీయత ఉట్టిపడే, చూడగానే రెప్పలార్పకుండా చూడాలనిపించే లాండ్ స్కేప్ లు, భక్తిపరవశంలో ముంచెత్తే దేవతా మూర్తుల చిత్రాలు, పోర్టెట్స్, మాతృప్రేమ మూర్తీభవించే తల్లి, 
పిల్లల చిత్రాలు తన కుంచెలతో పురుడుపోసుకుంటాయి. 

సహజత్వంతో ఈ చిత్రకారిణి రూపొందించిన చిత్రాలన్నీ అందమైన దృశ్యకావ్యాలే. తొలినాళ్ళలో లైన్ డ్రాయింగ్ తో మొదలైన చిత్రరచన నేడు ఆయిల్ కలర్స్, ఆర్కిలిక్, వాటర్, పోస్టర్ కలర్స్ వినియోగిస్తూ తనదైన శైలిలో కాన్వాస్ లను మలుస్తూ చెరగని సంతకం చేస్తున్నారు. 

జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి చిత్రకళా పోటీల్లో, ప్రదర్శనల్లో పాల్గొని అనేక అవార్డులను, రివార్డులను అందుకున్నారు. ఎస్వీ విశ్వ విద్యాలయంలో ఫైన్ ఆర్ట్ పూర్తిచేసిన ప్రసన్నజ్యోతి కొంతకాలం చిత్రకళా ఉపాద్యాయినిగా పనిచేసారు. ఉన్నత విద్యలు చదవకపోయానని ఏనాడు ఆలోజించలేదని, తనకు ఇష్టమైన చిత్రకళలో తృప్తిని పొందుతూనే ఉపాధి కూడా కల్పించుకుంటున్నారు. తను చిత్రించిన పెయింటింగ్ లు ఐదువేల నుంచి యాబైవేల వరకూ అమ్మకాలు జరిగాయన్నారు. విద్యతో పాటు కళారంగాల్లోనూ మహిళలు రాణించాలని, చిత్రకళ ద్వారా త్వరిత గతిన ఉపాధికూడా పొందవచ్చునని చెబుతున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని ఆర్ట్ గ్యాలరీలో, ఢిల్లీ, బెంగుళూర్, చెనై తదితర ప్రాంతాల్లో, గ్రూప్, సోలో ఎగ్జిబిషన్లో తన చిత్రాలు ప్రదర్శితమయ్యాయని చెప్పారు. 

చిత్రకళా రంగ ప్రవేశం గురించి ప్రసన్నజ్యోతి మాటల్లోనే... 


నాలోని చిత్రకళను మొదటిగా మా లైబ్రేరియన్ గుర్తించారు. అందరూ చదువూతూ ఉంటే నేను మాత్రం రఫ్ నోట్ బుక్ తీసుకుని పత్రికల్లో వచ్చిన, నచ్చిన చిత్రాలను గీస్తూ ఉంటాను. అవి ఆమె చూసి నన్ను అభినందించింది. తర్వాత మా అమ్మ గారు నన్ను ప్రోత్సహించింది. దీంతో నచ్చినవి గీస్తూనే జవహర్ బాల భవన్ లో చిత్రకారుడు కిషన్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. తర్వాత బీఎఫ్ ఏ ఎంట్రన్స్ వ్రాసి సీటు తెచ్చుకుని బీఎఫ్ఏ పూర్తిచేసాను. ముఖ్యంగా అనుకరణ నాకు ఇష్టం ఉండదు. నాదైన శైలిలో చిత్రించడం ఇష్టం. చిత్రకళలో ఎంతో స్వేచ్ఛ ఉంది. ఊహల్లో కలిగిన అనేక అంశాలను ఎలాంటి హద్దులు లేకుండా చిత్రంద్వారా చెప్పవచ్చు. వేల మాటల్లో చెప్పలేని భావాలను దృశ్యంలో చెప్పవచ్చు. చిత్రకళారంగంలో మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తాను. పేపర్స్ తో అందమైన క్రాఫ్ట్ తయారు చేయండం కూడా ఇష్టం.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...