ఎ.పి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎంపిక

ఎ.పి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎంపిక 


తెనాలి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి, వేమూరు నియోజకవర్గ నూతన కమిటి ఎంపిక ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు టి. రవీంద్రబాబు, కె. రత్నాకర్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బోస్ రోడ్ లోని ఫెడరేషన్ కార్యాలయంలో 
డివిజన్ సమావేశ జరిగింది. నూతన తెనాలినియోజకవర్గ అధ్యక్షునిగా అంబటి శ్యామ్ సాగర్, ప్రధాన కార్యదర్శిగా పుట్లా పున్నయ్య లను సమావేశంఏకగ్రీవంగా ఆమోదించింది. అదేవిదంగా కోశాధికారిగా డి. కోటేశ్వరావు, ఉపాధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు, సహాయ కార్యదర్శిగా బి. చందు, కార్యవర్గ సభ్యులుగా డి. నాగరాజు, ఎన్.జెశ్యామ్యూల్, గుమ్మడి ప్రకాశావులు ఎంపికయ్యారు. వేమూరు నియోజక వర్గ అధ్యక్షునిగా మేకలసుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా ఆళ్ళ శేషిరెడ్డి, గౌరవ సలహాదారులుగా బి. సురేష్ బాబు, ఎస్.ఎన్జహీర్లను ఎంపికచేసారు. ఈ సందర్భంగా ప్రత్యేక కేక్ ను కట్ చేసారు. తమ ఎంపికకు కృషిచేసిన రవీంద్రబాబు, రత్నాకర్ లను నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. జర్నలి సంక్షేమానికి నిరంతరంకృషిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నూతన సభ్యత్వాల నమోదును ప్రారంభించింది.