Skip to main content

డాక్టర్ పిల్లి వాసు కు నన్నయ విద్యాపీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం



డాక్టర్ పిల్లి వాసు కు నన్నయ విద్యాపీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం 


స్థానిక తెనాలి ఐతానగర్ కు చెందిన డా॥ పిల్లి వాసు కు నన్నయ విద్యాపీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డి.యన్, ఆర్ కళాశాల ఏ.జి కోర్సెస్ తెలుగుశాఖ మరియు నన్నయ విద్యాపీఠం వారు సంయుక్తంగా ఈ నెల 11 వ తేదీన నిర్వహించిన సభా కార్యక్రమంలో ఈ పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా భీమవరం డి.యన్. ఆర్ కళాశాలలోని ఆచార్య కలిదిండి సీతారామరాజు గారి స్మారక సమావేశ మందిరమైన సెమినార్ హాల్ లో, అనేక పుస్తకావిష్కరణల మధ్య జరిగిన మైత్రి సదస్సు కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యుల మేడిపల్లి రవికుమార్, ఆచార్య రేమిళ్ళ బెంకట కృష్ణశాస్త్రి, ఆచార్య యార్లగడ్డ రామకృష్ణ, మరియు దా॥ యండపల్లి పాండురంగ ప్రాధార్యులు ,పండితులు మరియు భాషాభిమానులందరి సమక్షంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారా వెలువరించిన ఉత్తమ పరిశోధనలకు గాను, డా|| పిల్లి వాసు ను ఈ విశిష్ట ప్రతిభా పురస్కారంతో సత్కరించారు. 
డాక్టర్. పిల్లి వాసు గతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని, మరియు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాన్ని పొందటంతో పాటు తాను చేసిన పరిశోధనకు గాను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ బంగారు పథకాన్ని బహుకరించింది. అంతేగాక కేంద్ర ప్రభుత్వం యొక్క విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం యు.జి.సి, వారిచే జాతీయ పురస్కారాన్ని రెండుసార్లు పొందటం ఎంతో విశేషం.
పిల్లి వాసు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని భాషా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన నూతన సిద్ధాంత భావాలతో కూడిన 58 పరిశోధనా పత్రాలను సమర్పించటం గొప్ప విషయమని, అటువంటి పరిశోధకునికి నేడు ఎంతో ప్రతిష్టాత్మకమైన నన్నయ విద్యా పీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం లభించటం విశేషమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు గుజ్జర్లమూడి కృపాచారి, మరియు విశ్వవిద్యాలయ రెక్టార్ మరియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. వర ప్రసాదమూర్తి, తెలుగు శాఖ ఆచార్యులు, పలువురు విద్యావేత్తలు, నాయకులు, డాక్టర్. పిల్లి వాసుకు అభినందనలు తెలియజేశారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...