Skip to main content

Posts

Showing posts from January, 2022

ఉద్యోగ అవకాశాలు

అదిరేటి సెట్లతో పుష్ప కవర్ సాంగ్ చిత్రీకరణ

అదిరేటి సెట్లతో పుష్ప కవర్ సాంగ్ చిత్రీకరణ తెనాలి:  పట్టణానికి చెందిన నూతన చిత్ర నిర్మాణ సంస్థ అనిల్ డిజిటల్స్ నిర్మాణ సారథ్యం లో యువ కొరియోగ్రాఫర్ కొండ్రు కిరణ్ నృత్య దర్శకత్వంలో ఇటీవల అల్ టైం ఇండస్ట్రీ హిట్ చిత్రం పుష్ప లోని ఊ అంటావా మామా ఉఊ అంటావా అనే పాటను కవర్ సాంగ్ గా ఆదివారం రాత్రి వేమూరు లోని ఓ దాభాలో చిత్రీకరించారు. ఇందులో ప్రధాన పాత్రలను ఫణి, షైనీ లు  చేస్తున్నారు. అదిరేటి సెట్ లలో, మిరుమిట్లు కొలిపే విద్యుత్ లైటింగులతో భారీ ఎత్తున ఈ కవర్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. అనిల్ డిజిటల్స్ అధినేత దేసమాల అనిల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీరస్థలి తెనాలి దర్శకుడు కనపర్తి రత్నాకర్ ముఖ్యఅతిధిగా పాల్గొని క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. శ్రీ శ్రీ మీడియా మునిపల్లి శ్రీకాంత్ మరో అతిధిగా పాల్గొని యూనిట్ ను అభినందించారు. యువత కళారంగం లో రాణించాలని కోరారు.

ఘనం గా దర్శకుడు రత్నాకర్ జన్మదిన వేడుకలు.

తెనాలి: పట్టణానికి చెందిన దర్శకుడు,                              పాత్రికేయుడు,వరల్డ్ రికార్డ్ హోల్డర్,            సమాచారహక్సంఘం జిల్లా కార్యదర్శి కనపర్తి           రత్నాకర్ జన్మదినోత్సవ వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్    కార్యాలయం లో శుక్రవారం ఘనం గా జరిగాయి.        ఈ   సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ తాను         జాతీయఉద్యమం నేపథ్యంలో , తెనాలి పరిసర       ప్రాంతానికి చెందిన చుక్కపల్లి రామయ్య చరిత్రని     వీరస్థలి తెనాలి అనే ఇండిపెండెంట్ చిత్రాన్ని          రూపొందించామని చిత్రాన్ని ప్రేక్షకులు                   ఆదరించారన్నారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం గా      అవార్డ్ లభించిందన్నారు. ఫిబ్రవరి ఆఖరి వారంలో  శ్రీ  మీడియా బ్యానర్ పై మరో నూతన    ...

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైభవంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

అనుభవాల నుంచి నేర్చుకోవాలి   బెంగళూరులోని సహజ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌ అండ్‌ హెచ్‌ఆర్‌  విజయ్‌ కుమార్‌   విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైభవంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని బెంగళూరులోని సహజ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌æఆర్కిటెక్ట్‌ అండ్‌ హెచ్‌ఆర్‌  విజయ్‌ కుమార్‌  తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో బుధవారం భారత 73వ గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు యుద్ధాల్లో వీర మరణం పొందిన సైనికులకు నివాళిగా ఏర్పాటు చేసిన అమర్‌ జవాన్‌ స్థూపానికి నివాళులర్పించి జ్యోతి వెలిగించారు. విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ, ఎన్‌సీసీ పరేడ్‌ ఎంతగానో ఆకర్షించింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెంగళూరులోని సహజ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన...

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటన

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది _మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది.  సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు పద్మ విభూషణ్‌ ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం._ _128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మ భూషణ్‌, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం._ _దివంగత జనరల్‌ బిపిన్‌రావత్‌తో పాటు యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌, యూపీకి చెందిన సాహిత్యవేత్త రాధేశ్యామ్‌ ఖేమ్కా(మరణానంతరం) , ప్రభా ఆత్రే(మహారాష్ట్ర) పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది._ _పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య,  కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్‌ పురస్కారాలు ప్రకటించింది._ _తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీలు దక్కాయి. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌ పద్మశ్రీ అవార్డులు దక్కాయి.  తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి._ _అలాగే భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా(తెలంగాణ...

క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌పై విజ్ఞాన్‌లో ప్రత్యేక సెమినార్‌

క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌పై విజ్ఞాన్‌లో ప్రత్యేక సెమినార్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఐక్యూఏసీ ఆధ్వర్యంలో సోమవారం ‘‘ క్యూఎస్‌ ర్యాంకింగ్‌ అండ్‌ ఐ–గేజ్‌ అక్రిడిటేషన్‌’’ అనే అంశంపై వర్చువల్‌ విధానంలో ప్రత్యేక సెమినార్‌ కార్యక్రమాన్ని నిర్వహించామని యూనివర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. వర్చువల్‌ విధానంలో ఏర్పాటు చేసిన ఈ సెమినార్‌ కార్యకమానికి ముఖ్య అతిథిగా హాజరైన క్లైంట్‌ రిలేషన్స్‌ క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ డైరక్టర్‌ సచిన్‌ కుమార్‌ మాట్లాడుతూ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ సాధించాలనే విద్యాసంస్థలకు అకడమిక్‌ రెపుటేషన్‌తో పాటు ఎంప్లాయర్‌ రెపుటేషన్‌ బాగా ఉండాలన్నారు. విద్యాసంస్థలో విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్లుగా అధ్యాపకులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రసిద్ధి చెందిన స్కూపస్‌ జర్నల్స్‌లో పరిశోధన పేపర్లు ప్రచురించడంతో పాటు అధ్యాపకుల సైటేషన్స్‌ ఎక్కువగా ఉండాలన్నారు. విద్యాసంస్థలో ఇంటర్నేషనల్‌ ఫ్యాకల్టీతో పాటు ఇంటర్నేషనల్‌ విద్యార్థులు కూడా సరైన నిష్పత్తిలో ఉండాలని తెలిపారు. వీటితో పాటు వీలై...

విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ ఘనంగా ప్రారంభం

‘‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ ఘనంగా ప్రారంభం   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చేతుల మీద ప్రారంభం   ఆన్‌లైన్‌ విద్యావిధానమే ట్రెండింగ్‌ : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌   విజ్ఞాన్స్‌ వర్సిటీకి మరో మైలురాయి : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ కే.హేమచంద్రారెడ్డి   విజనరీ ఆలోచనా విధానం : గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌   విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యం: విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య   ఉద్యోగాలు కల్పించే దిశగా శిక్షణ : విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ’’విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌ను గురువారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ...

విజ్ఞాన్స్‌ లారాలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు

విజ్ఞాన్స్‌ లారాలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌డే వేడుకలు వైభవంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్‌ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన విద్యా విధానం ఉండాలని తెలిపారు. కార్పొరేట్‌ ప్రపంచంలో యువతకు విస్తృత అవకాశాలున్నాయని, వాటిని సాధించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వ్యవసాయం, రక్షణ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి అభివృద్ధి చేసేలా పరిశోధనలు చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక విజన్‌తో ముందుకు వెళ్లాలని, క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని అన్నారు. ఒత్తిడి లేకుండా మంచి వాతావరణంలో బోధన చేస్తే మంచి ఆలోచనలు పుట్టుకొస్తాయని తెలిపారు.  ఎవరి జీవితం ఎలా ఉండాలనేది వారి కష్టంపైనే ఆధార పడి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు వారి ఆలోచనలు, జ్ఞానాన్ని సహచరులతో పంచుకోవాలని సూచించారు. అం...

venkat paintings

మౌలిక సదుపాయాల కల్పనకే ఏపీ ప్రభుత్వం పెద్దపీట

ఏపీలో రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం :  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మౌలిక సదుపాయాల కల్పనకే ఏపీ ప్రభుత్వం పెద్దపీటపంచ సూత్రాలతో ముందుకెళతామని స్పష్టం చేసిన మంత్రి మేకపాటి సకల రవాణా మార్గాలూ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ప్రతి రవాణా మార్గం మరో మార్గంతో పూర్తి అనుసంధానం ఏపీ ప్రత్యేకత చౌకగా సరకు రవాణా"  ప్రణాళికతో దూసుకెళుతున్న  ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణను గ్రామస్థాయికి చేర్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పీఎం గతిశక్తిపై కేంద్ర సమన్వయం కోసం ప్రతి రాష్ట్రం నుంచి ఒక నోడల్ ఆఫీసర్ దక్షిణాది రాష్ట్రాల సమక్షంలో "పీఎం గతిశక్తి"పై కేంద్రం నిర్వహించిన వర్చువల్ సదస్సులో మంత్రి మేకపాటి. అమరావతి, జనవరి, 17 : పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగస్వామ్యమై మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని మంత్రి మేకపాటి...

ఈ నెల 20న ‘‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌

ఈ నెల 20న ‘‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌ ఏపీ విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చేతుల మీద ప్రారంభం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఈ నెల 20న ’’విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న జరిగే విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ కే.హేమచంద్రారెడ్డి, విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొంటారని తెలియజేసారు. ఈ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌ వలన ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ విభాగంలో బీబీఏ(జనరల్‌), ఎంబీఏ (హెచ్‌ఆర్‌), ఎంబీఏ (ఫైనాన్స్‌), ఎంబీఏ(జనరల్‌) కో...

సంక్రాంతి శుభాకాంక్షలు

సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అదే సమయంలో బాధ్యతాయుతమైందని ప్రముఖ సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కొత్త పేటలోని ఏపి పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ఆద్వర్యంలో సంక్రాంతి సంబరాలు, తెనాలి, వేమూరు నియోజకవర్గాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.రవీంద్రబాబు, కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత జర్నలిస్టుల సంక్షేమానికి ఫెడరేషన్ చేస్తన్న కృషిని, సమస్యలపై సాధించిన వివజయాలను అధ్యక్ష, కార్యదర్శలు  వివరించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టుల పై ఎంతో సామాజిక బాధ్యత ఉందన్నారు. ఫెడరేషన్ కు న్యాయసలహాదారుగా వ్యవహరించటం గర్వకారణంగా ఉందన్నారు. మైత్రి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వైధ్యులు డాక్టర్ కృష్ణసందీప్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తమవంతు సహకాకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. గోపిటివి అధినేత వి. రాజారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విలేకరి వృత్తి నైపుణ్యాల...

విజ్ఞాన్‌లో పల్లెవించిన సంక్రాంతి

విజ్ఞాన్‌లో పల్లెవించిన సంక్రాంతి   సంక్రాంతి అంటే రైతుల పండుగ   విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య   విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు   సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిన విద్యార్థులు సంక్రాంతి విశిష్టతను తెలిపే రంగురంగుల రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బుధవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య విద్యార్థులతో మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రైతుల పండుగని తెలిపారు. మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. ఈ సమయంలో రైతు లోకం పంట చేతికొచ్చిన ఆనందంలో ఉంటుందని చెప్పారు. సంక్రాంతి పర్వదినాల్లో పల్లెటూళ్లు ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటాయని చెప్పారు. రకరకాల జానపద వినోద కళాకారులు, పగటివేషధారులు ఈ పండుగ సమయంలో పల్లెల్లో వినోదాన్ని పంచుతారని తెలిపారు. ఎడ్ల పందేలు, కోడి పందేలు, రంగవల్లులు, గొబ్బెమ...

గుంటూరులో ఐటీసీ వెల్‌కం హోటల్‌ని ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌

గుంటూరులో ఐటీసీ వెల్‌కం హోటల్‌ని ప్రారంభించిన సీఎం  వైయస్‌.జగన్‌ ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ గుంటూరు రావడం చాలా  సంతోషం.  ఐటీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజివ్‌ పూరికి ధన్యవాదాలు. ఐటీసీతో భాగస్వామ్యం మంచి అవకాశం. ఈ రోజు మనం ఈ హోటల్‌ ప్రారంభించుకోవడం ఓ మంచి కార్యక్రమం.  గుంటూరు లాంటి పట్టణంలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఉండటం, అలాంటి ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఐటీసీ భాగస్వామ్యం కావడం మంచి పరిణామం. ఐటీసీ భాగస్వామ్యంతో మనం వ్యవసాయరంగంలో ప్రత్యేకంగా పుడ్‌ ప్రాససింగ్‌లో ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో మనం ఏ గ్రామానికి వెళ్లినా మీరు మూడు రంగాల్లో సమూలమైన మార్పులు చూస్తారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మీరు ఈ మార్పులు గమనించవచ్చు. వ్యవసాయరంగం తీసుకుంటే ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు(ఆర్బీకేలు) ఉన్నాయి. దాదాపు 10,700 ఆర్బీకేలు రైతులను విత్తనం నుంచి విక్రయం వరకు చేయిపట్టుకుని నడిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సమూల మార్పులే ఆర్బీకేల ప్రధాన లక్ష్యం. గ్రామస్ధాయిలో వ్యవసాయరంగంలో ఏ రకమైన మౌలిక సదుపాయలను ప్రైమరీ ప్...

క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి దోహదపడతాయి

క్రీడలు మానసిక, శారీరక దృడత్వానికి దోహదపడతాయ - తెనాలి డీఎస్పీ స్రవంతి రాయ్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ ,తెనాలి:  క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని తెనాలి డీఎస్పీ డాక్టర్ స్రవంతీ రాయ్ పేర్కొన్నారు. పోలీసు శాఖ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా స్టోర్ట్ మీట్ నిర్వహించగా క్రీడల్లో తెనాలి డివిజన్ తరపున పాల్గొని పలు బహుమతులు అందుకున్నారు. ఈ స్పోర్ట్ మీట్లో తెనాలి సబ్ డివిజన్ కు ఓవరాల్ చాంపియన్ షిప్ లో రెండో స్థానం దక్కించుకున్నారు. వాలీబాల్, షటిల్ తదితర క్రీడల్లో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా తెనాలి డిఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో డీఎస్పీ ఆధ్వర్యంలో విజేతలకు అభినందన సభ నిర్వహించారు. సభలో డీఎస్పీ మాట్లాడుతూ క్రీడలు ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. మానసిక వత్తిడులు క్రీడల ద్వారా తగ్గించుకోవచ్చునన్నారు. విజేతలను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ నాయకులు టి. రవీంద్రబాబు, కె. రత్నాకర్, ఎ. శ్యామ్ సాగర్, పి.పున్నయ్య, ఎ. సాంబశివరావు, డి. కోటేశ్వరరావు, జి. ప్రభాకర్, ఎస్.ఎస్ జహీర్, ప్రేమ్ కుమార్, ఎం. సుట్టారావు, జి. ప్రకాశరావు...

విజ్ఞాన్స్‌లో వైభవంగా త్యాగరాజ ఆరాధన

విజ్ఞాన్స్‌లో వైభవంగా త్యాగరాజ ఆరాధన చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజ  175వ ఆరాధన సందర్భంగా విద్యార్థులు త్యాగరాజ కీర్తనలు ఆలపించారని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాదోపాసన ద్వారా భగవంతున్ని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడని పేర్కొన్నారు. ఆయన కీర్తనలు శ్రీరామునిపై అతనికి గల విశేషభక్తిని, వేదాలు, ఉపనిషత్తులపై అతనికున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయన్నారు. అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటక సంగీతానికి మూలస్తంభంగా పిలుస్తారని పేర్కొన్నారు. త్యాగరాజు జన్మదినాన్ని జాతీయ సంగీత దినోత్సవంగా నిర్వహిస్తారని విద్యార్థులకు తెలియజేసారు. రామేతి మధురం వాచం అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించిన ఘనత ఒక్క త్యాగరాజుకే దక్కుతుందన్నారు. త్యాగరాజు దాదాపు 800 కీర్తనలు రచించాడని విద్య...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు బ్యాండ్‌ ఎక్స్‌లెంట్‌ ర్యాంకింగ్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు బ్యాండ్‌ ఎక్స్‌లెంట్‌ ర్యాంకింగ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు న్యూఢిల్లీలోని ఏఆర్‌ఐఐఏ–2021 ( అటల్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఆన్‌ ఇన్నోవేషన్‌ అచీవ్‌మెంట్స్‌) ర్యాంకింగ్స్‌లో బ్యాండ్‌ ఎక్స్‌లెంట్‌ ర్యాంకింగ్‌ లభించిందని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న రీసెర్చ్‌ సెంటర్స్, ఇంకుబేషన్‌ సెంటర్స్, పేటెంట్స్, స్టార్టప్స్, రీసెర్చ్‌ పబ్లికేషన్స్, అవగాహన ఒప్పందాలు వంటి రంగాలలో ఉత్తమ ప్రతిభకు గాను యూనివర్సిటీకు బ్యాండ్‌ ఎక్స్‌లెంట్‌ కేటగిరీలో చోటు లభించిందన్నారు. ఈ ర్యాంకింగ్‌ వలన విద్యార్థుల ఇన్నోవేషన్‌ ఆలోచనలకు, పేటెంట్స్, ఇంకుబేషన్‌ సెంటర్‌కు నిధులు మంజూరు చేయడంలో ఉపయోగపడుతుందని వెల్లడించారు.

లూయీ బ్రెయిల్ అంధుల ఆశాజ్యోతి

లూయీ బ్రెయిల్ అంధుల ఆశాజ్యోతి .                   - వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. ప్రపంచవ్యాప్తంగా అంధుల జీవితాల్లో జ్ఞాన సముపార్జనకు తోడ్పడే బ్రెయిలీ లిపి ని   రూపొందించి అంధుల ఆశాజ్యోతిగా లూయీ బ్రెయిల్ నిలిచారని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 6వ తేదీ గుంటూరు బ్రాడీపేట లోని శ్రీ షిర్డీ సాయి దీన జన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన లూయీ బ్రెయిల్ వర్ధంతి కార్యక్రమానికి లక్ష్మణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.సభకు శ్రీ షిర్డీ సాయి దీన జన సేవా సమితి అధ్యక్షులు ఆనంగి పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ లూయీ బ్రెయిల్ అంధుల అంధకార జీవితంలో వెలుగులు నింపారన్నారు.ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్లకు పైగా అంధులు ఉన్నారని భారతదేశంలో కోటి ఇరవై లక్షల మంది అంధులు ఉన్నారని తెలియజేశారు.బ్రెయిలీ లిపి అంధులకు చుక్కానిగా నిలిచిందన్నారు.మేనరిక వివాహాలు సంపూర్ణంగా నిరోధించడం ద్వారా అంగవైకల్యాన్ని అధికమించగలమన్నారు.శ్రీలంక ను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ దేశాలు న...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘‘ఏఏ’’ గ్రేడ్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘‘ఏఏ’’ గ్రేడ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఐఐటీ మద్రాస్‌ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్‌పీటీఈల్‌ ర్యాంకింగ్స్‌లో ‘‘ఏఏ గ్రేడ్‌’’ లభించిందని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వయం ఎన్‌పీటీఈఎల్‌ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జాతీయస్థాయిలో 50లోపు ర్యాంక్‌ సాధించి ‘‘ఏఏ గ్రేడ్‌’’ను సొంతం చేసుకుందన్నారు. ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ రకాల కోర్సులలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు పాల్గొని 893 కోర్సు సర్టిఫికెట్లు సాధించారన్నారు. వీటిలో 19 మందికి టాపర్స్, 10 గోల్డ్, 151 సిల్వర్, 392 ఎలైట్, 304 మంది సాధారణ ఉత్తీరణత సర్టిఫికెట్స్‌ సాధించారని వెల్లడించారు. 2021వ సంవత్సరంలో ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ రకాల కోర్సులలో జనవరి నుంచి డిసెంబర్‌ వరకు నిర్వహించిన కోర్సులలో ఉత్తమ ప్రతిభకు గాను విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ‘‘ఏఏ గ్రేడ్‌’’ లభించిందని వెల్లడించారు.