Skip to main content

సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:


సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని
అదే సమయంలో బాధ్యతాయుతమైందని ప్రముఖ సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కొత్త పేటలోని ఏపి పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ఆద్వర్యంలో సంక్రాంతి సంబరాలు, తెనాలి, వేమూరు నియోజకవర్గాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.రవీంద్రబాబు, కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత జర్నలిస్టుల సంక్షేమానికి ఫెడరేషన్ చేస్తన్న కృషిని, సమస్యలపై సాధించిన వివజయాలను అధ్యక్ష, కార్యదర్శలు  వివరించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టుల పై ఎంతో సామాజిక బాధ్యత ఉందన్నారు. ఫెడరేషన్ కు న్యాయసలహాదారుగా వ్యవహరించటం గర్వకారణంగా ఉందన్నారు. మైత్రి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వైధ్యులు డాక్టర్ కృష్ణసందీప్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తమవంతు సహకాకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. గోపిటివి అధినేత వి. రాజారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విలేకరి వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. 

ఎంపి జ్యూయలర్స్ అధినేత నరేష్ కుమార్ జైన్
 ఫెడరేషన్ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ ఫెడరేషన్ కార్యక్రమాలను వెన్నంటి ప్రోత్సహిస్తున్న కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, శశి ఆహార్ అధినేత వుప్పల వరదరాజులు, హ్యాపీ హాస్పటల్ యాజమాన్యానికి, రాష్ట్ర వార్త చీఫ్ ఎడిటర్ కె.రమేష్, మునిసిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసా దకు, మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలించారికి కృతజ్ఞతలు తెలపారు. నూతన కార్యవర్గం 

ప్రమాణ స్వీకారం: 
ఏపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి, వేమూరు నియోజక వర్గ నూతన కార్యవర్గంతో డివిజన్ కార్యదర్శి  కనపర్తి రత్నాకర్ ప్రమాణస్వీకారం చేయించారు. తెనాలి నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులుగా అంబటి శ్యామ్ సాగర్, పి.పున్నయ్య, సహాయ కార్యదర్శి బి.చందు, 
కోశాధికారిగా డికోటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎం.సాంబశివరావు, కార్యవర్గ సభ్యులుగా ఎస్ జె. శామ్యుల్, డి.నాగరాజు ప్రమాణ స్వీకారం చేశారు. అలానే వేమూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులుగా ఎం.సుబ్బారావు, ఎ. శేషిరెడ్డి, 
గౌరవ సలహాదారులుగా  బచ్చు సురేష్ బాబు, ఎస్ఎస్ జహీర్, యు. కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్య వర్గాన్ని ఫెడరేషన్ సభ్యులు పి.ప్రకాశరావు, ఎం.రవికుమార్, ప్రేమ్ కుమార్, లక్ష్మణరావు, వి. భూషణం, వెంకటేశ్వరరావు తదితరు లు అభినందించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...