Skip to main content

విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ ఘనంగా ప్రారంభం

‘‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ ఘనంగా ప్రారంభం

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చేతుల మీద ప్రారంభం

  ఆన్‌లైన్‌ విద్యావిధానమే ట్రెండింగ్‌ : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

  విజ్ఞాన్స్‌ వర్సిటీకి మరో మైలురాయి : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ కే.హేమచంద్రారెడ్డి

  విజనరీ ఆలోచనా విధానం : గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

  విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యం: విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య

  ఉద్యోగాలు కల్పించే దిశగా శిక్షణ : విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ’’విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌ను గురువారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ లాంచ్‌ ప్రోగ్రామ్‌ లోగో, బ్రౌచర్, www.vignanonline.com వెబ్‌సైట్‌ను గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ కే.హేమచంద్రారెడ్డి, విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్, డైరక్టర్‌ టామ్‌ జోసెఫ్‌ కూడా పాల్గొని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మినిస్టర్‌ డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ విభాగంలో బీబీఏ(జనరల్‌), ఎంబీఏ (హెచ్‌ఆర్‌), ఎంబీఏ (ఫైనాన్స్‌), ఎంబీఏ(జనరల్‌) కోర్సులతో పాటు ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విభాగంలో 4 కోర్సులైన బీబీఏ (జనరల్‌), ఎంబీఏ (ఫైనాన్స్‌), ఎంబీఏ (జనరల్‌), ఎంబీఏ (హెచ్‌ఆర్‌) కోర్సులకు సంబంధించిన క్లాసులను  విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. భవిష్యత్‌లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యా విధానమే ట్రెండింగ్‌ కానుందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్, లైఫ్‌ సైన్స్, మెడికల్, బయో మెడికల్‌ వంటి కోర్సులు మానవాళికి నిత్యజీవితంలో అత్యవసరమన్నారు. స్టూడెంట్‌ సెంట్రిక్‌ విద్యా విధానంతో పాటు చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ విద్యార్థులకు అందుబాటులో రావాలన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీకి మరో మైలురాయి : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ కే.హేమచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ కే.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ నేడు ‘‘ విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ’’ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌తో బీబీఏ, ఎంబీఏ కోర్సులను ఆన్‌లైన్‌లో విద్యార్థులకు చేరువ చేయడం ద్వారా విజ్ఞాన్‌కు ఇది మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. విద్యార్థుల  భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లుగా విద్యా విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో విజ్ఞాన్స్‌ సంస్థలు ఎల్లప్పుడు ముందుంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యా విధానాన్ని బ్రిక్స్‌ దేశాలతో పోటీపడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.

విజనరీ ఆలోచనా విధానం : గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌
బీబీఏ, ఎంబీఏ వంటి  యూజీ, పీజీ కోర్సులను కోర్సులను విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు అందజేయడమనేదే విజనరీ ఆలోచనా విధానమని  గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అన్నారు. భవిష్యత్‌ అవసరాలు, మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎప్పటికప్పడు టెక్నాలజీలను అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపారు.

విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యం: విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య
విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా మరింత మంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు వారికి చేరువ కావడమే లక్ష్యమని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. 21వ శతాబ్ధంలో విద్యార్థులు ఉపాధ్యాయులపైనో, కళాశాలల్లో ఉండే అధ్యాపకులపైనో ఆధారపడకూడదన్నారు. ఎవరైతే స్వయం శిక్షణ( సెల్ఫ్‌ లెర్నింగ్‌) చేస్తారో వాళ్లకే నిజమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. నేటి డిజిటల్‌ యుగంలో ఈ రోజు ఉన్నవి రేపటి రోజున ఉంటాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. క్షణ క్షణం విషయం మారిపోవటం, కొత్త ఆవిష్కరణలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిదానికి కళాశాలకు వెళ్లి నేర్చుకుంటామంటే కుదిరే పనికాదన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థులు అంతర్జాలంలోకి వెళ్లి  నేర్చుకునేందుకు అలవాటుపడాలన్నారు. 

ఉద్యోగాలు కల్పించే దిశగా శిక్షణ : విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు
బీబీఏ, ఎంబీఏ కోర్సులను ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన విద్యార్థులందిరికీ ఉద్యోగాలు కల్పించే దిశగా శిక్షణ ఇస్తామని విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు సాధించడానికి అవసరమయ్యే అన్ని నైపుణ్యాలను విద్యార్థులకు అందజేస్తామన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...