న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటన

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది

_మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది.  సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌కు పద్మ విభూషణ్‌ ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం._

_128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మ భూషణ్‌, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం._

_దివంగత జనరల్‌ బిపిన్‌రావత్‌తో పాటు యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌, యూపీకి చెందిన సాహిత్యవేత్త రాధేశ్యామ్‌ ఖేమ్కా(మరణానంతరం) , ప్రభా ఆత్రే(మహారాష్ట్ర) పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది._

_పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య,  కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్‌ పురస్కారాలు ప్రకటించింది._

_తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీలు దక్కాయి. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌ పద్మశ్రీ అవార్డులు దక్కాయి.  తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి._

_అలాగే భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా(తెలంగాణ)కు సంయుక్తంగా  పద్మభూషణ్ ప్రకటించింది. సీరమ్‌ సంస్థ సైరస్‌ పూనావాలాకు, టెక్‌ దిగ్గజాలు సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లకు పద్మభూషణ్‌ పురస్కారాలు దక్కాయి._