Skip to main content

లూయీ బ్రెయిల్ అంధుల ఆశాజ్యోతి

లూయీ బ్రెయిల్ అంధుల ఆశాజ్యోతి.
                  - వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.

ప్రపంచవ్యాప్తంగా అంధుల జీవితాల్లో జ్ఞాన సముపార్జనకు తోడ్పడే బ్రెయిలీ లిపి ని 
 రూపొందించి అంధుల ఆశాజ్యోతిగా లూయీ బ్రెయిల్ నిలిచారని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 6వ తేదీ గుంటూరు బ్రాడీపేట లోని శ్రీ షిర్డీ
సాయి దీన జన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన లూయీ బ్రెయిల్ వర్ధంతి కార్యక్రమానికి లక్ష్మణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై
ప్రసంగించారు.సభకు శ్రీ షిర్డీ సాయి దీన జన సేవా సమితి అధ్యక్షులు ఆనంగి పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ లూయీ బ్రెయిల్ అంధుల అంధకార జీవితంలో వెలుగులు నింపారన్నారు.ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్లకు పైగా అంధులు ఉన్నారని భారతదేశంలో కోటి ఇరవై లక్షల మంది అంధులు ఉన్నారని తెలియజేశారు.బ్రెయిలీ లిపి అంధులకు చుక్కానిగా నిలిచిందన్నారు.మేనరిక వివాహాలు సంపూర్ణంగా నిరోధించడం ద్వారా అంగవైకల్యాన్ని అధికమించగలమన్నారు.శ్రీలంక ను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ దేశాలు నేత్రదాన ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.విశిష్ట అతిథిగా విచ్చేసిన విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ కార్పొరేషన్ చైర్ పర్సన్ కుమారి ముంతాజ్ పఠాన్ ప్రసంగిస్తూ శ్రీ షిర్డీ సాయి దీన జన సేవా సమితి సంస్థ 1995లో ప్రారంభమై వందలాది అంధులకు బ్రెయిలీ లిపితో  జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంస్థ సేవలను కొనియాడారు. వికలాంగులకు,అంధులకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.నేత్రదానన్ని ప్రోత్సహించాలని కోరారు.సంస్థ అధ్యక్షులు ఆనంగి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ పబ్బరాజు వెంకటేశ్వరరావు ఈ సంస్థను స్థాపించి వందలాది అంధులలో వెలుగులు నింపారని కొనియాడారు.
పోటీ పరీక్షలలో అంధులకు శిక్షణ, నైపుణ్యాలను అందించి అనేక మంది బ్యాంకు అధికారులు గా, ఉపాధ్యాయులుగా నియమితులు అవటం పట్ల ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పీఎస్ మూర్తి,ఉపాధ్యక్షులు మధుసూదన్ రావు,అంధులైన బ్యాంక్ ఆఫీసర్ కోటిరెడ్డి,అంధులైన రిటైర్డ్ లెక్చరర్ లింగారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన  లక్ష్మణరెడ్డి,ముంతాజ్ పఠాన్ ల కు సంస్థవారు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...