విజ్ఞాన్స్ యూనివర్సిటీకు బ్యాండ్ ఎక్స్లెంట్ ర్యాంకింగ్
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు న్యూఢిల్లీలోని ఏఆర్ఐఐఏ–2021 ( అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్) ర్యాంకింగ్స్లో బ్యాండ్ ఎక్స్లెంట్ ర్యాంకింగ్ లభించిందని వర్సిటీ ఇంచార్జి వైస్ చాన్స్లర్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న రీసెర్చ్ సెంటర్స్, ఇంకుబేషన్ సెంటర్స్, పేటెంట్స్, స్టార్టప్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్, అవగాహన ఒప్పందాలు వంటి రంగాలలో ఉత్తమ ప్రతిభకు గాను యూనివర్సిటీకు బ్యాండ్ ఎక్స్లెంట్ కేటగిరీలో చోటు లభించిందన్నారు. ఈ ర్యాంకింగ్ వలన విద్యార్థుల ఇన్నోవేషన్ ఆలోచనలకు, పేటెంట్స్, ఇంకుబేషన్ సెంటర్కు నిధులు మంజూరు చేయడంలో ఉపయోగపడుతుందని వెల్లడించారు.