Skip to main content

12న విజ్ఞాన్స్‌లో ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌

12న విజ్ఞాన్స్‌లో ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌
ముఖ్య అతిథులుగా పలువురు కేంద్ర మంత్రులు

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిలో ఆజాదీ క అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 12న ఇండియాలో డెవలప్‌ చేసిన బిగ్గెస్ట్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ను లాంచ్‌ చేస్తున్నామని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’కు సంబంధించిన పోస్టర్, బ్రౌచర్స్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పలువురు కేంద్ర మంత్రులైన రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్టీల్‌ ఆఫ్‌ ఇండియా మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే, రైల్వేస్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ యూనియన్‌ మినిస్టర్‌ దర్శన జర్దోష్, సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ రామ్‌దాస్‌ బందు అత్వాలే, కమ్యూనికేషన్స్‌ ఆఫ్‌ ఇండియా మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ దేవుసిన్‌ జెసింగ్‌భాయ్‌ చౌహాన్‌లు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇదే కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా, ముంబాయిలోని వాక్‌హార్డ్‌ ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ హుజాయిఫా ఖోరకివాలా, హైదరాబాద్‌లోని అక్రితి గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ కుల్దీప్‌ రైజాడ, రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ సత్యం కుశవాహలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌లో భాగంగా 1000 మంది విద్యార్థులు 500 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ‘‘ సే నో టు ప్లాస్టిక్‌ ’’ అనే అంశాన్ని ప్రమోట్‌ చేస్తూ  500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇండియాలో డెవలప్‌ చేసిన బిగ్గెస్ట్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ను లాంచ్‌ చేస్తున్నామని తెలియజేసారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జనరల్‌ బిపిన్‌ రావత్‌కు ఘన నివాళి అర్పించడంతో పాటు కోవిడ్‌ సమయంలో సేవలందించిన వారియర్స్‌ను సన్మానించడం జరుగుతుందన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...