ఎపి బిసి సంక్షేమ సంఘం జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా వసంత యామిని

ఎపి బిసి సంక్షేమ సంఘం జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా వసంత యామిని 


తెనాలి: ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల, టీ.వీ కళాకారిణి గుంటుపల్లి వసంత యామినీ బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం సంఘ కార్యాలయంలో ఆమెను సంఘ అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళ రావు యాదవ్ నుంచి నియామక పత్రం అందుతున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వసంత యామిని తన నియామకానికి కృషి చేసిన సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యనగాల నూకానమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వసంత యామిని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణాజిలా సంఘ అధ్యక్షులు మనబోతుల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వసంత యామినిని బుధవారం కళాకారులు బెజ్జంకి నాగమణి, సాంబశివరావు, సోమేష్, మధుకర్, జీవన్, శ్రీ శ్రీ మీడియా నిర్వహకుడు మునిపల్లి శ్రీకాంత్, రమణ, నారాయణ, ఓంకార్ తదితరులు అభినందించారు.