విజ్ఞాన్స్‌లో ఘనంగా ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌

  స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంరంభం :  సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ సెంట్రల్‌ మినిస్టర్‌ రామ్‌దాస్‌ బందు అత్వాలే

  ప్రజలందరూ భాగం కావాలి:  రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్టీల్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ మినిస్టర్‌ ఫగ్గణ్‌ సింగ్‌ కులస్తే

  ప్రతి ఒక్కరూ భాగమవ్వాలి :  రాష్ట్రీయ సామాజిక్‌ సమరసత సంగథన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ రాజు సింగ్‌

  16 చరిత్రాత్మక ప్రాంతాలను గుర్తించాం: రాష్ట్రీయ సామాజిక్‌ సమరసత సంగథన్‌ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ క్రిష్ణకిషోర్‌



గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇండియాలో డెవలప్‌ చేసిన బిగ్గెస్ట్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ను శనివారం సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ సెంట్రల్‌ మినిస్టర్‌ రామ్‌దాస్‌ బందు అత్వాలే, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్టీల్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ మినిస్టర్‌ ఫగ్గణ్‌ సింగ్‌ కులస్తే కలిసి  ఆవిష్కరించారు.  ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌లో భాగంగా 1000 మంది విద్యార్థులు 500 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ‘‘ సే నో టు ప్లాస్టిక్‌ ’’ అనే అంశాన్ని ప్రమోట్‌ చేస్తూ  500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జనరల్‌ బిపిన్‌ రావత్‌కు ఘన నివాళి అర్పించడంతో పాటు కోవిడ్‌ సమయంలో సేవలందించిన వారియర్స్‌ను ఘనంగా సన్మానించారు.

స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంరంభం :  సెంట్రల్‌ మినిస్టర్‌ రామ్‌దాస్‌ బందు అత్వాలే
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ సెంట్రల్‌ మినిస్టర్‌ రామ్‌దాస్‌ బందు అత్వాలే మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అంటే అజరామరమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంరంభమని తెలియజేసారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలియజేసారు. స్వాతంత్య్ర సంగ్రామాన్ని గుర్తుకు చేసుకోవడంతో పాటు ఈ 75 ఏళ్లలో దేశం సాధించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పురోగతిని ఓ ఉత్సవంలా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.

ప్రజలందరూ భాగం కావాలి: రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్టీల్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ మినిస్టర్‌ ఫగ్గణ్‌ సింగ్‌ కులస్తే 
‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ లో ప్రజలందరూ భాగం కావాలని రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్టీల్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ మినిస్టర్‌ ఫగ్గణ్‌ సింగ్‌ కులస్తే   పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో సర్పంచులు కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ జాతీయగీతం పాడి రాష్ట్ర గీత్‌ వెబ్‌ సైట్‌ లో ఉంచాలని సూచించారు. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ కార్యాలయాల్లో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ బ్యానర్లు, పోస్టర్లను ఏర్పాటుచేయాలన్నారు. స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన కథనాలు, బులెటిన్లు, ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసేటప్పుడు ప్రసార మాధ్యమాలు, మీడియా ఛానెళ్లు, న్యూస్‌ వెబ్‌సైట్లు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ లోగోను కూడా ప్రసారం చేయాలని కోరింది.

ప్రతి ఒక్కరూ భాగమవ్వాలి :  రాష్ట్రీయ సామాజిక్‌ సమరసత సంగథన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ రాజు సింగ్‌

రాష్ట్రీయ సామాజిక్‌ సమరసత సంగథన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ రాజు సింగ్‌ మాట్లాడుతూ  ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు, క్విజ్‌ పోటీలు, చిత్రలేఖన పోటీలు వంటి ప్రత్యేక పోటీలు ఏర్పాటుచేసామన్నారు. ఈ క్యాంపెయిన్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు రంగ సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా ఈ ఉత్సవాల్లో భాగమవ్వాలని కేంద్రం పిలుపునిచ్చిందన్నారు. 

16 చరిత్రాత్మక ప్రాంతాలను గుర్తించాం: రాష్ట్రీయ సామాజిక్‌ సమరసత సంగథన్‌ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ క్రిష్ణకిషోర్‌
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 16 చారిత్రాత్మక ప్రాంతాలను గుర్తించామని రాష్ట్రీయ సామాజిక్‌ సమరసత సంగథన్‌ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్స్‌ వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్, ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు పాల్గొన్నారు.