Skip to main content

ఎ.పి రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి - గాంధీ విగ్రహానికి వినతిపత్ర సమర్పణ



తెనాలి 
 దేశంలో, రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరఫరా విభాగాల పంపిణీ అన్నింటిని ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తూ వాటి పురోభివృద్ధికి అవసరమైన సంపూర్ణమైన ప్రభుత్వ మద్దతు కల్పించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది. ఎపియస్ పిఇ జె.ఏ.సి. పిలుపు మేరకు తెనాలి లో తెనాలి విద్యుత్ జెఏసి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో విద్యుత్ ఉద్యోగులు వారికి సహకారంగా ఇతర సంస్థలు, ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. పట్టణ వీధులలో ప్రెయిటికరణ వలన జరుగు నష్టాలను తెలియజేస్తూ, నినాదాలు చేస్తూ ప్రదర్శన విజయవంతంగా సాగింది. గాంధీ చౌక్ లో మహాత్మాగాంధీజి విగ్రహానికి పూలమాలలు వేసి, వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ దాసరి వెంకటేశ్వరరావు ఎపియస్ పి ఇ జెఏసి వైస్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతికి, ప్రజా జీవన గమనానికి విద్యుత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అలాంటి విద్యుత్తును ప్రయివేటీకరించడం ధారుణం అని, వెంటనే ప్రభుత్వాలు ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులు ను వెంటనే  క్రమబద్ధీకరణ చేయలని డిమాండ్ చేశారు.
యస్ కె. నూరిల్ అమీన్ రాష్ట్ర ఎపియస్ పిఇ జెఏసి ఆర్గనైజింగ్ సెక్రటరీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న సమంజసమైన సమస్యల పరిష్కారాన్ని వెంటనే పరిష్కరించాలన్నారు. ఇప్పటికి ఎన్నో పర్యాయాలు ఎన్ని విన్నపాలు చేసినా పట్టించుకోవడం లేదని, వెంటే సమస్యలను పరిష్కరించాలని, ప్రయివేటీకరణ ఉపసంహరించుకోని పక్షంలో అంచలవారీగా సమ్మెను ఉదృతం చేస్తామని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి డివిజను ఎఐటియుసి అధ్యక్షులు, ఎపిజెఏసి వైస్ చైర్మన్ యస్. గురుబ్రహ్మం, మరియు తెనాలి డివిజను జెఎసి చైర్మన్ వై. రాజు, జెఐసి కన్వీనర్ ఆర్. మోహనరావు, వైస్ చైర్మన్ డి. వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ యస్ కె. అమీన్, యస్.కెఖలీం బాషా, జె.వి.యస్. రాంబాబు, కన్నా వెంకటేశ్వరరావు, పి. సురేష్ బాబు, కె. రాజశేఖర్,  యం. శ్రీకాంత్, నాగరాజు, తదితర విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...