విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్డీ
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన చేరెడ్డి సోనాలి శ్రీదుర్గ అనే విద్యార్థినికి తమ యూనివర్సటీ పీహెచ్డీ పట్టా అందించిందని ఇంచార్జి వైస్ చాన్స్లర్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎక్సిపెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్ ఆన్ సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ ఇన్ఫ్లుయన్డ్స్ బై బాసిల్లస్ స్పెసిస్ ’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి, ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్.రూబెన్ గైడ్గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 3 ఈఎస్సీఐ, 2 స్కూపస్ జర్నల్ పబ్లికేషన్, 2 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పేపర్లు పబ్లిష్ చేశారని తెలియజేసారు.