Skip to main content

ప్రతి విద్యార్థిలో మానవత్వం వెల్లివిరియాలి

ప్రతి విద్యార్థిలో మానవత్వం వెల్లివిరియాలి

  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య

యూనివర్సిటీలో విద్యనభ్యసించే ప్రతి విద్యార్థిలో మానవత్వం వెల్లివిరియాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు.  ‘యంగ్‌ జనరేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ పేరుతో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, హైదరాబాద్, చీరాల ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన 500 సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించిన సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక అభినందన సభను ఏర్పాటుచేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ తమ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 500 సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థి దశలోనే ఇటువంటి సేవాకార్యక్రమాలను నిర్వహించడం వలన వారిలో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా సమయంలో అనాధలకు, రోడ్డు పక్కన నివసించే వారికి, వృద్ధులకు భోజనాలు పంచిపెట్టడంతో పాటు అవసరమైన వారికి కూరగాయలు, నిత్యావసర సరుకులు, బట్టలు అందించారన్నారు. అంతేకాకుండా అనాథ ఆశ్రమాలలో చదువుకుంటున్న విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు పంచిపెట్టారని తెలియజేసారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడే 200 మందికి దాదాపు రూ.11,65,350 పైగా అవసరమైన ఆర్థిక సహాయాలను కూడా అందించారని వెల్లడించారు. కరోనా సమయంలో పాజిటివ్‌ అయిన వారికి సాంకేతిక టెక్నాలజీను ఉపయోగించి హాస్పిటల్స్‌లలో బెడ్స్‌ ఏఏ ప్రాంతాలలో ఖాళీ ఉన్నాయో తెలియజేయడంతో పాటు ఆక్సిజన్‌ సిలిండర్లను కూడా అందజేసారు. ప్రమాదాల్లో గాయపడటం, గుండె ఆపరేషన్లకు అవసరమయ్యే రక్తాన్ని టీమ్‌ సభ్యులే స్వయంగా వెళ్లి ఇవ్వడంగానీ, ఏర్పాటు చేయడంగానీ చేస్తున్నారు. గుండె సమస్యలు, కిడ్నీ, రోడ్డు ప్రమాదాలు, జనరల్‌ మెడిసిన్‌ సమస్యలతో బాధపడే వారికి ఆర్థిక సహాయం అందజేసి వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి వారిని చైతన్యపరచడం, వివిధ రకాల సమస్యలపై వారికి అవగాహన కల్పించడం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, వికలాంగులకు మెడికల్‌ కిట్స్‌ను అందజేయడంతో పాటు వాటిని ఎలా వినియోగించాలో తెలియజేస్తున్నారు. దురదృష్టవశాత్తు వికలాంగులుగా మారిన వారికి యంగ్‌ జనరేషన్‌ టీమ్‌ సభ్యులు వీల్‌చైర్లు అందజేయడంతో పాటు వృద్ధులకు కర్రలు అందజేస్తున్నారు. నారీ శక్తి అనే పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు అవసరమైన పౌష్టిక ఆహార పదార్థాలు, మెడిసిన్‌ వంటివి అందిస్తున్నారు. పలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు శానిటరీ పాడ్స్‌ను అందజేసారు. గ్రీన్‌ యాత్ర అనే పేరుతో మొక్కలను నాటడం, వాటిని కాపాడటం, ప్రజలను చైతన్యపరచడం వంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. రోడ్డు పక్కన ఉండే జంతువులకు ఆహారాన్ని అందజేస్తున్నారు. పంట చేతికందిన సమయంలో అకాల వర్షాలతో ముంచెత్తిన నివార్‌ తుఫాన్‌ బాధిత రైతులకు అండగా నిలవడంతో పాటు పొలంలో తడిసిపోయిన పంటలను రైతులతో కలిసి కోత కోసి పంటను వారి ఇళ్లకు చేర్చారు. యంగ్‌ జనరేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ పేరుతో జాతీయస్థాయిలో రిజిస్ట్రేషన్‌ కూడా నమోదు చేసుకున్నారు. అనంతరం ‘యంగ్‌ జనరేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ ప్రెసిడెంట్‌ షేక్‌ సాధిక్, వైస్‌ ప్రెసిడెంట్‌ శశికిరణ్, సెక్రటరీ షేక్‌ సావేజ్, మెంటర్స్‌ సుష్మకొణికి, కాటూరి అహిమాంష్, లీల, 200 మంది సభ్యులకు ప్రశంసా పత్రాలను అందజేసారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...