Skip to main content

Posts

Showing posts from March, 2022

ఘనంగా బుద్ధా టీవీ తెనాలి కార్యాలయం ప్రారంభోత్సవం

ఘనంగా బుద్ధా టీవీ తెనాలి కార్యాలయం ప్రారంభోత్సవం - బుద్ధ టీవీ కార్యాలయాన్ని ప్రారంభించిన    జర్నలిస్ట్ సంఘనేత రత్నాకర్ - కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు ప్రెస్    అధ్యక్షుడు కుమార్ రాజా టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలిలో నూతనంగా మీడియా సంస్థ బుద్ధ టీవీ కార్యాలయాన్ని స్థానిక బలాజిరావు పేటలో గురు  ప్రారంభించారు. బుద్ధ టీవీ సీఈఓ దుర్గారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, అతిధులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి, దర్శకులు కనపర్తి రత్నాకర్, గుంటూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుమార్ రాజలు కార్యాలయంలోని స్టూడియో, నూతన గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ఫైట్ ఫర్ బ్రైట్ నినాదం తో మీడియా రంగం లోకి అడుగు పెట్టిన బుద్ధ టీవీ మీడియా రంగం లో రాణించాలని ఆకాంక్షించారు. సామాన్యుడి పక్షాన నిలిచి ప్రజల సమస్యల పరిష్కారం లో తమవంతు పాత్ర పోషించాలన్నారు. తెనాలిలో  వృత్తి పరంగా తమవంతు సహకారం ఉంటుందన్నారు. గుంటూరు జిల్లా బ్రాంచ్ ఇంచార్జి తిరుమల రావు  మాట్లాడుతూ తె...

విజ్ఞాన్స్‌లో వైభవంగా సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన

విజ్ఞాన్స్‌లో వైభవంగా సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థులు సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ యాక్టివిటీ కౌన్సిల్‌లోని థియేటర్‌ ఆర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ‘‘ వరల్డ్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ డే’’ను పురస్కరించుకుని సత్యహరిశ్చంద్ర నాటకాన్ని వైభవంగా ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు  మాట్లాడుతూ నాటకం సర్వజననీయం, సర్వకాలీనమన్నారు. ప్రాముఖ్యత కలిగిన అతి ప్రాచీన కళల్లో నాటక రంగం కూడా ఒకటన్నారు. ప్రస్తుతమున్న నాటక రంగం కాలక్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యిందన్నారు. విద్యార్థులు ప్రజలకు నాటర రంగం ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. నాటకాలు ప్రదర్శించడం ద్వారా విద్యార్థులు మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చునన్నారు. అనంతరం నాటక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రశంసా పత్రాలను అందజేసారు.

ప్రపంచ రంగస్థల దినోత్సవం 20 22 సందేశ కర్త-పీటర్ సెల్లర్స్* పరిచయం

* ప్రపంచ రంగస్థల దినోత్సవం 20 22 సందేశ కర్త-పీటర్ సెల్లర్స్* పరిచయం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్ లో జన్మించారు.ఒక ఓపెరా థియేటర్ను నడుపుతూ ఫెస్టివల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టినది- ఆయన విప్లవాత్మక  వ్యాఖ్యానాత్మక ధోరణి -20వ శతాబ్ది క్లాసిక్స్ పట్ల అప్పటివరకు ఉన్న అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చివేయ గలిగింది. సమకాలీన సంగీతానికి తన మద్దతుతో కూడిన  ప్రాజెక్టుల ద్వారా సృజనాత్మక వృత్తి కళాకారులకు మరింత విస్తృత పరిధిలో పని చేయడానికి ఉపయోగపడింది. ఆయన కళాకృతులు- కళ యొక్క శక్తివంతమైన విలువలతో కూడిన అభివ్యక్తికి, సాంఘిక చైతన్యానికి తోడ్పడ్డాయి.  ఆయన తన ఓపెరాను-డచ్ నేషనల్ ఓపెరా, ఇంగ్లీష్ నేషనల్ ఓపెరా, ఫ్రాన్స్ లో ఎక్స్ ఆన్ ప్రొవాన్స్  (జూలై నెలలో)జరిగే వార్షిక అంతర్జాతీయ సంగీతోత్సవం, చికాగో గీతోత్సవం, పారిస్ జాతీయ నృత్యోత్సవం,సాల్జ్ బర్గ్  ఉత్సవం వంటివి కొన్ని ప్రముఖ వేదికలపై ప్రదర్శించారు.  2020 చివరిలో కరోనాకు ప్రతిస్పందనగా తన దర్శకత్వంలో రూపొందించిన చిత్రం "ఈ శరీర అస్తిత్వం క్షణభంగురం" అని చ...

ముక్కుతో ఎన్టీఆర్‌, చరణ్‌లను గీసిన ఆర్టిస్ట్‌ రాంబాబు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్' విడుదల సందర్భంగా.. హైదరాబాద్​కు చెందిన ఓ చిత్రకారుడు చిత్ర బృందానికి వినూత్నంగా ఆల్​ది బెస్ట్​ తెలిపాడు. నిజాంపేట్​కు చెందిన సద్గురు ది స్కూల్ అఫ్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు... ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు.. ముక్కుతో డైరెక్టర్ రాజమౌళితో పాటు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రాలను చిత్రించి యూనిట్​కి శుభాకాంక్షలు తెలియజేశారు.

170 మంది విజ్ఞాన్స్‌ లారా విద్యార్థుకు ఉద్యోగాలు

170 మంది విజ్ఞాన్స్‌ లారా విద్యార్థుకు ఉద్యోగాలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని∙నాలుగో సంవత్సరానికి చెందిన 170 మంది విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్, కాప్‌ జెమినీ, హెచ్‌సీఎల్, మైండ్‌ ట్రీ వంటి బహుళజాతి కంపెనీలకు ఎంపికయ్యారని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ ఇన్ఫోసిస్‌ కంపెనీకు 44, కాప్‌ జెమినీ–32, హెచ్‌సీఎల్‌–84, మైండ్‌ ట్రీ కంపెనీకు–10 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలియజేసారు. వీరందరూ రూ.3.75 లక్షల నుంచి రూ.6.5 లక్షల ప్యాకేజీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులలో ఈసీఈ–58, సీఎస్‌ఈ–56, ఈఈఈ–31, మెకానికల్‌–14, ఐటీ–8, సివిల్‌ డిపార్ట్‌మెంట్ల నుంచి 3 గురు విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ తమ కళాశాలలో చదివే వి...

నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్‌

నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్‌   కేరళలోని సీడబ్యూఆర్‌డీఎమ్‌ సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కమలం జోసెఫ్‌   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా వరల్డ్‌ వాటర్‌ డే కంటికి కనిపించని భూగర్భ జలాన్ని పది కాలాలపాటు కాపాడుకుంటేనే మానవ జాతికి భవిష్యత్‌ ఉంటుందని కేరళలోని సీడబ్యూఆర్‌డీఎమ్‌ (సెంటర్‌ ఫర్‌ వాటర్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కమలం జోసెఫ్‌ పేర్కొన్నారు.  చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ ఫోరమ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ డిపార్ట్‌మెంట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్‌ వాటర్‌ డేను పురస్కరించుకుని ‘‘ నీడ్‌ ఫర్‌ ఎఫెక్టివ్‌ హ్యూమన్‌ ఇంటర్‌వెన్షన్‌ ఇన్‌ ఎన్సూరింగ్‌ వాటర్‌ సెక్యూరిటీ’’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘ గ్రౌండ్‌ వాటర్‌ : మేకింగ్‌ ద ఇన్విసిబుల్‌ విసిబుల్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. వర్చువల్‌ విధానంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ కమలం జోసెఫ్‌ మాట్లాడు...

విజ్ఞాన్స్‌ వర్సిటీతో అస్పైర్‌– యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ వర్సిటీతో అస్పైర్‌– యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అవగాహన ఒప్పందం చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో హైదరాబాద్‌లోని అస్పైర్‌–యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ విశ్వవిద్యాలయాల మధ్య  అవగాహన ఒప్పందం జరిగిందని యూనివర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను అస్పైర్‌–యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ జీవీ ప్రసాద్‌కు  అందజేసారు. ఈ సందర్భంగా ఇంచార్జి రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కొలబరేటివ్, రివ్యూవింగ్‌ ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్, మెంటర్‌షిప్‌ ఫర్‌ స్టార్టప్స్, ఇంటర్న్‌షిప్స్, రీసెర్చ్‌ ల్యాబ్స్‌ వసతులను వినియోగించుకోవటం ద్వారా పురోభివృద్ధిని సాధిస్తామని తెలియజేసారు.

*రాష్ట్ర స్థాయి సాంఘీక నాటకోత్సవములు*

*రాష్ట్ర స్థాయి సాంఘీక నాటకోత్సవములు* *************************** *కళాకారులుకు, సాంకేతిక నిపుణులుకు,సమాజాల నిర్వాహకులుకు హృదయ పూర్వక నమస్కారాలు.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలను ఆదరిరించి, కళాకారులును ప్రోత్సాహించాలని చేసే ఈ ప్రయత్నంలో కళాకారులు,సాంకేతిక నిపుణులు,సమాజాల నిర్వాహకులు అందరూ తమ సహాయ సహాకారాలు అందించాలని కోరుతున్నాను.* *...తోరం రాజా...*  *నా ఆద్వర్యంలో* *విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల  ఆడిటోరియంలో మే 6 వ తేదీ నుండి 12 వ తేదీ మధ్యలో  12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును.* *విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియం నందు జూన్ మొదటివారంలో (తేదీ వివరాలు త్వరలో వెల్లడి అగును) 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరప బడును.* *తిరుపతి  పట్టణంలో మహతి ఆడిటోరియం నందు  జూలై  మొదటి వారంలో (తేదీ వివరాలు త్వరలో వెల్లడి అగును) 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును.* *ఒకోక్క నాటికకు ప్రదర్శనా పారితోషకం 12000 (పన్నెండు వేల రూపాయులు) అందజేయ బడును.* *ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులు బహుమతులు అంద జేయబడును.* *ఈ పోటీల్లో తెలుగు నాటిక ఏదైనను దరఖాస్తు పంప వచ్చును.* *ఒక సమాజానికి ఒక ...

నాన్న పాలలో వెన్న

నాన్న పాలలో వెన్న నాన్న ఓ బ్రహ్మ  జన్మకు కారణమవుతూ ! నాన్న ఓ స్నేహితుడు చిన్ననాటి నుండి నీతో ఆడుకుంటూ! నాన్న ఓ నిచ్చెన  ఎదుగుదలకు మెట్లు అవుతూ ! నాన్న ఓ గురువు నిరంతరం జీవితపాఠాలు బోధిస్తూ ! నాన్న ఓ మార్గదర్శకుడు బ్రతుకుకు బంగారు బాట చూపుతూ ! నాన్న ఓ రక్షక కవచం  నీ ఒంటిని కనురెప్పలా కాస్తూ ! నాన్న ఓ అనురాగ సింధువు ఎన్నో స్వేదబిందులు చిందిస్తూ ! నాన్న ఓ త్యాగజీవి నీకన్నింటినీ ఇవ్వడానికి తనెన్నింటినో కోల్పోతూ! నాన్న పాలలో వెన్న కడవరకూ తన కష్టాలను నీకు కనబడక దాచేస్తూ ! - సురేంద్ర రొడ్డ , తిరుపతి 9491523570

ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2022 డైరీ ఆవిష్కరణ

ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2022 డైరీ ఆవిష్కరణ తెనాలి: స్థానిక బోస్ రోడ్ లో టాలెంట్ ఎక్స్ ప్రెస్  కార్యాలయంలో ఆదివారం ఉదయం  ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో  ఫెడరేషన్ ముద్రించిన 2022 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఫెడరేషన్ అధ్యక్షుడు టీ. రవీంద్ర బాబు అధ్యక్షతన జరిగింది. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు టి రవీంద్ర బాబు, కనపర్తి రత్నాకర్ లు ఫెడరేషన్ ప్రింట్ మీడియా  డైరీ ని ఆవిష్కరించారు. ఎలక్ట్రానిక్ మీడియా కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీలను నియోజకవర్గ అధ్యక్ష,కార్యదర్శులు అంబటి శ్యామ్ సాగర్, పుట్ల పున్నయ్య ఆవిష్కరించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్  గౌరవ సలహాదారులు బచ్చు సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్ లు సభ్యులకు  ఫెడరేషన్ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. జర్నలిస్టుల ల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు జి ప్రభాకర్, డి రమేష్ బాబు, ఎం రవి కుమార్, జి ప్రకాశరావు, ఎం సుబ్బారావు, డి వెంకటేశ్వర్లు,కె సాంబశివరావు, ఎం శ్రీకాంత్, వి.భూష...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘కైజెన్‌–2కే22

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘కైజెన్‌–2కే22 ’ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ మీట్‌ ‘‘ కైజెన్‌–2కే22’ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కైజెన్‌( కీ టు ఆంబీషియస్‌ అండ్‌ ఇంటెలెక్చుయల్‌ జోన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ నోవల్టీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఖానా–పఖానా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వంటల పోటీలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ డైవర్సిటీ, మోడ్యులారిటీ, ఓపెన్‌నెస్, స్లాగ్‌ రిసోర్సెస్, మ్యాచింగ్‌ సైకిల్‌... ఈ ఐదు సూత్రాలను విద్యార్థులు పాటించినట్లైతే విజయం తథ్యమన్నారు. భవిష్యత్తు లక్ష్యాలు సాధించాలంటే మన సంపాదనలో కొంత భాగాన్ని క్రమశిక్షణతో పొదుపు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మార్కెట్లో కొన్ని వేల కంపెనీలు ఉంటాయని, వాటి పనితీరును అంచ...

ఆర్గానిక్‌ వ్యవసాయంతోనే సాధ్యం

ఆర్గానిక్‌ వ్యవసాయంతోనే సాధ్యం   పద్మశ్రీ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా మహిళలకు శిక్షణా కార్యక్రమం రైతులు లాభాలు గడించాలంటే ఆర్గానిక్‌ వ్యవసాయంతోనే సాధ్యమని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని కెమికల్‌ ఇంజినీరింగ్, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్, అగ్రికల్చర్‌ అండ్‌ హార్టీ కల్చర్‌ డిపార్టమెంట్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ పండ్లు కూరగాయల కోత అనంతరం వాటి నిలువ ఉంచే విధానాలు, వాటికి అదనపు విలువ జోడింపు’’ అనే అంశాలపై నారాకోడూరు, చేబ్రోలు మండలలోని మహిళలకు ప్రత్యేకంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వివిధ అధ్యయనాలు వెలువరించిన అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఉత్పత్తి చేసిన ఆహారంలో మూడింట ఒక వంతు వృథాగా పోతుందని కార్యక్రమానికి హాజరైన మహిళలకు, విద్యార్థులకు తెలియజేసారు...

విజ్ఞాన్స్‌ వర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ వర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌  మెకానికల్‌ విభాగానికి చెందిన బాచిన హరీష్‌బాబుకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ మోడలింగ్‌ అండ్‌ ఆప్టిమైజేషన్‌ ఆఫ్‌ డెడ్‌ మెటల్‌ జోన్‌ టు మినిమైజ్‌ కటింగ్‌ అండ్‌ త్రస్ట్‌ ఫోర్సెస్‌ ఇన్‌ మిల్లింగ్‌ ఆఫ్‌ ఏఐఎస్‌ఐ డీ2 స్టీల్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని మెకానికల్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కే.వెంకటరావు గైడుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో  2 ఎస్‌సీఐ మరియు 2 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు ప్రచురించారు. పీహెచ్‌డీ పట్టా పొందిన బాచిన హరీష్‌బాబును విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభనందించారు.

విజ్ఞాన్స్‌ ఫార్మసీ విద్యార్థినికి బంగారు పతకం

విజ్ఞాన్స్‌ ఫార్మసీ విద్యార్థినికి బంగారు పతకం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన పుట్ట చంద్రలేఖకు జేఎన్‌టీయూ కాకినాడ నుంచి బంగారు పతకం లభించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినికి ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాకినాడ జేఎన్‌టీయూ నిర్వహించిన 8వ స్నాతకోత్సవంలో విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేసిన పుట్ట చంద్రలేఖకు బంగారు పతకాన్ని అందజేసిందని వెల్లడించారు. ఈమెకు 2016–2020 సంవత్సరాల అకడమిక్‌ ఫార్మసీ విభాగంలో జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలోని అన్ని కాలేజీలలోని విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు (88.76 శాతం) సాధించినందుకు ఈమెకు బంగారు పతకం లభించిందని తెలియజేసారు. ప్రస్తుతం ఈమె నైపర్‌–గౌహతిలో ఫార్మాస్యూటికల్స్‌ విభాగంలో ఎంఎస్‌ చదవుతుందని తెలియజేసారు. బంగారు పతకం సాధించిన పుట్ట చంద్రలేఖను విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.

అమెరికన్‌ జర్నల్స్‌లో విజ్ఞాన్స్‌ ఫార్మసీ విద్యార్థుల సత్తా

అమెరికన్‌ జర్నల్స్‌లో విజ్ఞాన్స్‌ ఫార్మసీ విద్యార్థుల సత్తా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలలోని ఫార్మా–డీ ఆరో సంవత్సరం విద్యార్థులు అమెరికాలోని ఫార్మాసిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆన్యూవల్‌ కన్వెన్షన్‌ (ఏపీహెచ్‌ఏ)–2022 జర్నల్‌లో మూడు రీసెర్చ్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూఎస్‌ఏలోని టెక్సాస్, సాన్‌ ఆంటోనియాలో ఈ నెల 18 నుంచి 21వ తారీఖు వరకు జరగనున్న ఏపీహెచ్‌ఏ–2022 మీటింగ్‌లో ఈ పేపర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఫార్మా రంగంలో ఏపీహెచ్‌ఏ అనే సంస్థ అమెరికాలో అతిపెద్ద, మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన సంస్థలో మన విద్యార్థుల పేపర్లు ప్రచురితమయ్యాయని వెల్లడించారు. ఫార్మా స్యూటికల్‌ సైంటిస్ట్స్, స్టూడెంట్‌ ఫార్మాసిస్ట్స్‌ వంటి అందరితో పోటీపడి విద్యార్థులు పేపర్లు ప్రచురించారని తెలియజేసారు. విద్యార్థులు ఈ పేపర్లు ప్రచురించడంలో విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాల డీన్‌ డాక్టర్‌ సతీష్‌ ఎస్‌ గొట్టిపాటి వీరికి గైడ్‌గా వ్యవహరించారు.

అన్ని రంగాల్లో రాణించాలి

అన్ని రంగాల్లో రాణించాలి   గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ హెన్రీ క్రిస్టీనా   స్త్రీలు శక్తిస్వరూపులు : ఫ్యామిలీ కౌన్సిలర్‌ డాక్టర్‌ జీవన లత దర్శి   మహిళల్లోనే వైవిధ్యమైన నాయకత్వ లక్షణాలు : ఏవీకే సుజాత   అవకాశాల కోసం ఎదురుచూడొద్దు : విజ్ఞాన్స్‌ వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇంటర్నేషనల్‌ మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ హెన్రీ క్రిస్టీనా అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మంగళవారం ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ హెన్రీ క్రిస్టీనా మాట్లాడుతూ స్త్రీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ఎందరో మహిళలు దేశ నాయకులుగా చరిత...

జిల్లా శాఖా గ్రంథాలయాన్ని సందర్శించిన అహ్మద్

జిల్లా శాఖా గ్రంథాలయాన్ని  సందర్శించిన అహ్మద్ తెనాలి: పట్టణం లోని జిల్లా గ్రంధాలయాన్ని కలకత్తాకు చెందిన రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఫీల్డ్ ఆఫీసర్ దీప్తే దు దాసు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి షేక్ పీర్ అహ్మద్ శాఖ గ్రంథాలయం తో పాటు వేటపాలెం, చుండూరు, కూచిపూడి, పెదరావూరు గ్రంథాలయాలను బుధవారం సందర్శించారు. పుస్తకాలను తనికీచేశారు. గ్రంథాలయ అధికారి కె. జాన్సీ సిబ్బంది అరుణ, సుబ్బారావు లకు గ్రంథాలయ నిర్వహణపై పలు సూచనలు చేశారు. పనితీరు పై సంతృప్తిని వ్యక్తం చేశారు.

విజ్ఞాన్స్‌లో ఘనంగా నేషనల్‌ సైన్స్‌ డే

విజ్ఞాన్స్‌లో ఘనంగా నేషనల్‌ సైన్స్‌ డే చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సోమవారం నేషనల్‌ సైన్స్‌ డే సంబరాలను ఘనంగా నిర్వహించామని వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్, ఐక్యూఏసీల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ఇంటిగ్రేటెడ్‌ అప్రోచ్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ సస్టేనబుల్‌ ఫ్యూచర్‌’’ అనే అంశంపై సైన్స్‌ డేను నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంబాయిలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లోని కెమిస్ట్రీ డివిజన్‌ డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.ఆచారీ వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ వంటి అవాంతరాలను ఎదుర్కోవడంలో సైన్స్‌ పాత్ర ఎనలేనిదన్నారు. దశాబ్ధాలుగా గడిచిన అనుభవం, సేకరించిన పరిజ్ఞానం ఆధారంగా శాస్త్రవేత్తలు స్వల్పకాలంలోనే కోవిడ్‌ టీకాలను ఉత్పత్తి చేసి వేగంగా జనబాహుళ్యానికి అందించగలిగారన్నారు. ప్రభుత్వాలు బడ్జెట్‌లో శాస్త్రసాంకేతిక రంగాలలో పరిశోధన, అభివవృద్ధికి గణనీయంగా నిధులు కేటాయించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఆధునిక ప్రయోగశాలల ఏర్పా...

చినరావూరు శ్రీకృష్ణ మందిరం ఆధ్వర్యంలో భారీ ప్రభ

తెనాలి: మహా శివరాత్రి ని పురస్కరించుకుని సోమవారం చినరావూరు లోని శ్రీ కృష్ణ మందిరం భక్త సమాజం ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ప్రభ భక్తులను అలరిస్తుంది. ప్రతి సంవత్సరం మందిరం ఆధ్వర్యంలో భారీ విద్యుత్ ప్రభ ను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.