170 మంది విజ్ఞాన్స్ లారా విద్యార్థుకు ఉద్యోగాలు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ లారా ఇంజినీరింగ్ కళాశాలలోని∙నాలుగో సంవత్సరానికి చెందిన 170 మంది విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్, కాప్ జెమినీ, హెచ్సీఎల్, మైండ్ ట్రీ వంటి బహుళజాతి కంపెనీలకు ఎంపికయ్యారని విజ్ఞాన్స్ లారా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఫణీంద్రకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఫణీంద్రకుమార్ మాట్లాడుతూ ఇన్ఫోసిస్ కంపెనీకు 44, కాప్ జెమినీ–32, హెచ్సీఎల్–84, మైండ్ ట్రీ కంపెనీకు–10 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలియజేసారు. వీరందరూ రూ.3.75 లక్షల నుంచి రూ.6.5 లక్షల ప్యాకేజీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులలో ఈసీఈ–58, సీఎస్ఈ–56, ఈఈఈ–31, మెకానికల్–14, ఐటీ–8, సివిల్ డిపార్ట్మెంట్ల నుంచి 3 గురు విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ తమ కళాశాలలో చదివే విద్యార్థులకు డిగ్రీ పట్టాతో పాటు, కళాశాలలో ఉన్నప్పుడే ఉద్యోగం వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం వల్లే విద్యార్థులు వివిధ బహుళజాతి సంస్థలకు ఎంపికై సత్తాచాటుతున్నారని పేర్కొన్నారు. తమ కళాశాలలో మొదటి సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ విద్యతో పాటు ప్రత్యేక తరగతులు, మేము అవలంభించే కౌన్సిలింగ్ సిస్టం విధానం, ప్రత్యేక ట్రైనింగ్ క్లాస్లే కారణమని పేర్కొన్నారు. విద్యార్థులను బలవంతంగా, బాధతో చదివించడం కాకుండా.... విద్యార్థులే స్వతహాగా చదువుకునే విధంగా ప్రోత్సాహించటం, ఆలోచన కలిగించటం, జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనే అభిరుచిని కలగజేస్తామన్నారు. ప్రతి కంపెనీకి కావలసిన నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని... వాటికి అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఫణీంద్ర కుమార్, ఉపాధి కల్పనాధికారులు, ఆయా విభాగాల అధిపతులు పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు.