ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2022 డైరీ ఆవిష్కరణ

ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2022 డైరీ ఆవిష్కరణ
తెనాలి: స్థానిక బోస్ రోడ్ లో టాలెంట్ ఎక్స్ ప్రెస్  కార్యాలయంలో ఆదివారం ఉదయం  ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో  ఫెడరేషన్ ముద్రించిన 2022 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఫెడరేషన్ అధ్యక్షుడు టీ. రవీంద్ర బాబు అధ్యక్షతన జరిగింది. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు టి రవీంద్ర బాబు, కనపర్తి రత్నాకర్ లు ఫెడరేషన్ ప్రింట్ మీడియా  డైరీ ని ఆవిష్కరించారు. ఎలక్ట్రానిక్ మీడియా కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీలను నియోజకవర్గ అధ్యక్ష,కార్యదర్శులు అంబటి శ్యామ్ సాగర్, పుట్ల పున్నయ్య ఆవిష్కరించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్  గౌరవ సలహాదారులు బచ్చు సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్ లు సభ్యులకు  ఫెడరేషన్ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. జర్నలిస్టుల ల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు జి ప్రభాకర్, డి రమేష్ బాబు, ఎం రవి కుమార్, జి ప్రకాశరావు, ఎం సుబ్బారావు, డి వెంకటేశ్వర్లు,కె సాంబశివరావు, ఎం శ్రీకాంత్, వి.భూషణరావు,ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.