Skip to main content

ఘనంగా బుద్ధా టీవీ తెనాలి కార్యాలయం ప్రారంభోత్సవం

ఘనంగా బుద్ధా టీవీ తెనాలి కార్యాలయం ప్రారంభోత్సవం
- బుద్ధ టీవీ కార్యాలయాన్ని ప్రారంభించిన 
  జర్నలిస్ట్ సంఘనేత రత్నాకర్

- కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు ప్రెస్ 
  అధ్యక్షుడు కుమార్ రాజా


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలిలో నూతనంగా మీడియా సంస్థ బుద్ధ టీవీ కార్యాలయాన్ని స్థానిక బలాజిరావు పేటలో గురు  ప్రారంభించారు. బుద్ధ టీవీ సీఈఓ దుర్గారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, అతిధులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి, దర్శకులు కనపర్తి రత్నాకర్, గుంటూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుమార్ రాజలు కార్యాలయంలోని స్టూడియో, నూతన గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ఫైట్ ఫర్ బ్రైట్ నినాదం తో మీడియా రంగం లోకి అడుగు పెట్టిన బుద్ధ టీవీ మీడియా రంగం లో రాణించాలని ఆకాంక్షించారు. సామాన్యుడి పక్షాన నిలిచి ప్రజల సమస్యల పరిష్కారం లో తమవంతు పాత్ర పోషించాలన్నారు. తెనాలిలో  వృత్తి పరంగా తమవంతు సహకారం ఉంటుందన్నారు.
గుంటూరు జిల్లా బ్రాంచ్ ఇంచార్జి తిరుమల రావు  మాట్లాడుతూ తెనాలి లో బుద్ధా టీవీ ఎలక్ట్రానిక్ మీడియా రావడం చాలా సంతోషంకరం అన్నారు. గుంటూరు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కుమార్ రాజా మాట్లాడుతూ మంచి అసయాలతో మంచి సర్వీస్ తో గత సంవత్సర కాలం నుంచి మంచి సేవలు అందిస్తున్న బుద్ధా టీవీ ఇంకొక బ్రాంచ్ ని ప్రారంభించినందుకు అభినందనలు తెలిపారు. బుద్ధా టీవీ తో తనకు ఉన్న గత అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
బుద్ధా టీవీ సీఈఓ,ఎండి లు దుర్గారెడ్డి, సతీష్ రెడ్డి నూతన విధానంముతో  మీడియా రంగం లో సరికొత్త కార్యక్రమాలతో లేటెస్ట్ పరికరాలతో  శరవేగంగా దూసుకుపోతోంది అని వివరించారు. అదే విధంగా ప్రజా సమస్యలపై ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ఉంచడం జరిగిందన్నారు. ఏదైనా సమస్యలపై నెంబర్ కి కాల్ చేసిన యెడల సమస్య పరిష్కారానికై బుద్ధా టీవీ పాటు పడుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో బుద్ధా టీవీ సంస్థ అధినేత దుర్గారెడ్డి, ఎండి సతీష్ రెడ్డి, గుంటూరు బ్రాంచ్ ఇంచార్జి తిరుమల రెడ్డి, తెనాలి ఇంచార్జి దినేష్ బుద్ధా టీవీ స్టాఫ్, ఎం. శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...