ఘనంగా బుద్ధా టీవీ తెనాలి కార్యాలయం ప్రారంభోత్సవం

ఘనంగా బుద్ధా టీవీ తెనాలి కార్యాలయం ప్రారంభోత్సవం
- బుద్ధ టీవీ కార్యాలయాన్ని ప్రారంభించిన 
  జర్నలిస్ట్ సంఘనేత రత్నాకర్

- కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు ప్రెస్ 
  అధ్యక్షుడు కుమార్ రాజా


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలిలో నూతనంగా మీడియా సంస్థ బుద్ధ టీవీ కార్యాలయాన్ని స్థానిక బలాజిరావు పేటలో గురు  ప్రారంభించారు. బుద్ధ టీవీ సీఈఓ దుర్గారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, అతిధులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి, దర్శకులు కనపర్తి రత్నాకర్, గుంటూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుమార్ రాజలు కార్యాలయంలోని స్టూడియో, నూతన గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ఫైట్ ఫర్ బ్రైట్ నినాదం తో మీడియా రంగం లోకి అడుగు పెట్టిన బుద్ధ టీవీ మీడియా రంగం లో రాణించాలని ఆకాంక్షించారు. సామాన్యుడి పక్షాన నిలిచి ప్రజల సమస్యల పరిష్కారం లో తమవంతు పాత్ర పోషించాలన్నారు. తెనాలిలో  వృత్తి పరంగా తమవంతు సహకారం ఉంటుందన్నారు.
గుంటూరు జిల్లా బ్రాంచ్ ఇంచార్జి తిరుమల రావు  మాట్లాడుతూ తెనాలి లో బుద్ధా టీవీ ఎలక్ట్రానిక్ మీడియా రావడం చాలా సంతోషంకరం అన్నారు. గుంటూరు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కుమార్ రాజా మాట్లాడుతూ మంచి అసయాలతో మంచి సర్వీస్ తో గత సంవత్సర కాలం నుంచి మంచి సేవలు అందిస్తున్న బుద్ధా టీవీ ఇంకొక బ్రాంచ్ ని ప్రారంభించినందుకు అభినందనలు తెలిపారు. బుద్ధా టీవీ తో తనకు ఉన్న గత అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
బుద్ధా టీవీ సీఈఓ,ఎండి లు దుర్గారెడ్డి, సతీష్ రెడ్డి నూతన విధానంముతో  మీడియా రంగం లో సరికొత్త కార్యక్రమాలతో లేటెస్ట్ పరికరాలతో  శరవేగంగా దూసుకుపోతోంది అని వివరించారు. అదే విధంగా ప్రజా సమస్యలపై ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ఉంచడం జరిగిందన్నారు. ఏదైనా సమస్యలపై నెంబర్ కి కాల్ చేసిన యెడల సమస్య పరిష్కారానికై బుద్ధా టీవీ పాటు పడుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో బుద్ధా టీవీ సంస్థ అధినేత దుర్గారెడ్డి, ఎండి సతీష్ రెడ్డి, గుంటూరు బ్రాంచ్ ఇంచార్జి తిరుమల రెడ్డి, తెనాలి ఇంచార్జి దినేష్ బుద్ధా టీవీ స్టాఫ్, ఎం. శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.