అమెరికన్ జర్నల్స్లో విజ్ఞాన్స్ ఫార్మసీ విద్యార్థుల సత్తా
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ ఫార్మసీ కళాశాలలోని ఫార్మా–డీ ఆరో సంవత్సరం విద్యార్థులు అమెరికాలోని ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ ఆన్యూవల్ కన్వెన్షన్ (ఏపీహెచ్ఏ)–2022 జర్నల్లో మూడు రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూఎస్ఏలోని టెక్సాస్, సాన్ ఆంటోనియాలో ఈ నెల 18 నుంచి 21వ తారీఖు వరకు జరగనున్న ఏపీహెచ్ఏ–2022 మీటింగ్లో ఈ పేపర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఫార్మా రంగంలో ఏపీహెచ్ఏ అనే సంస్థ అమెరికాలో అతిపెద్ద, మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన సంస్థలో మన విద్యార్థుల పేపర్లు ప్రచురితమయ్యాయని వెల్లడించారు. ఫార్మా స్యూటికల్ సైంటిస్ట్స్, స్టూడెంట్ ఫార్మాసిస్ట్స్ వంటి అందరితో పోటీపడి విద్యార్థులు పేపర్లు ప్రచురించారని తెలియజేసారు. విద్యార్థులు ఈ పేపర్లు ప్రచురించడంలో విజ్ఞాన్స్ ఫార్మసీ కళాశాల డీన్ డాక్టర్ సతీష్ ఎస్ గొట్టిపాటి వీరికి గైడ్గా వ్యవహరించారు.