విజ్ఞాన్స్లో ఘనంగా జాతీయస్థాయి ఫుడో–ఫీస్టా 2కే22 చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నేషనల్ లెవల్ ‘‘ ఫుడో–ఫీస్టా 2కే22’’ను శనివారం ఘనంగా నిర్వహించారని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెనాలిలోని డబుల్ హార్స్ జనరల్ మేనేజర్ క్రిష్ణ ప్రసాద్ ఎన్వీ పోలిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులందరూ సాంప్రదాయ ఆహారపు అలవాట్లను భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన బాధ్యతను తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. అందుకు మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర అవసరమని తెలిపారు. శ్రద్ధగా చదువుకోవాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉండి, శ్రద్ధగా చదువుకునే విద్యార్థులు జీవితంలో ఏ అవకాశాన్నయినా అందిపుచ్చుకోగలరని, ఉన్నత శిఖరాలను చేరుకోగలరని వివరించారు. లియో గ్లోబల్ ఓవర్సీస్ మేనేజింగ్ డైరక్టర్ లగడపాటి వీరాంజనేయులు మాట్లాడుతూ ఫుడ్ టెక్నాలజీ పూర్తిచేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం పాటుపడాల...