Skip to main content

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి ఫుడో–ఫీస్టా 2కే22

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి ఫుడో–ఫీస్టా 2కే22

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నేషనల్‌ లెవల్‌ ‘‘ ఫుడో–ఫీస్టా 2కే22’’ను శనివారం ఘనంగా నిర్వహించారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెనాలిలోని డబుల్‌ హార్స్‌ జనరల్‌ మేనేజర్‌ క్రిష్ణ ప్రసాద్‌ ఎన్‌వీ పోలిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులందరూ సాంప్రదాయ ఆహారపు అలవాట్లను భవిష్యత్‌ తరాలకు అందజేయాల్సిన బాధ్యతను తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. అందుకు మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర అవసరమని తెలిపారు. శ్రద్ధగా చదువుకోవాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉండి, శ్రద్ధగా చదువుకునే విద్యార్థులు జీవితంలో ఏ అవకాశాన్నయినా అందిపుచ్చుకోగలరని, ఉన్నత శిఖరాలను చేరుకోగలరని వివరించారు. లియో గ్లోబల్‌ ఓవర్‌సీస్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ లగడపాటి వీరాంజనేయులు మాట్లాడుతూ ఫుడ్‌ టెక్నాలజీ పూర్తిచేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం పాటుపడాలని అన్నారు. లక్ష్యాలను ఏర్పరచుకోవటంతో పాటుగా విద్యార్థులు క్రమశిక్షణ, చిత్తశుద్దితో ప్రయత్నిస్తే ఎంతటి విజయాలనైనా సొంతం చేసుకుంటారని చెప్పారు. ప్రధానంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వారి వారి రంగాల్లో చోటు చేసుకుంటున్న నూతన ఆవిష్కరణలపై పట్టుసాధించగలిగిన ప్రతి విద్యార్థి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారని తెలిపారు. అనంతరం ఫుడో–ఫీస్టా 2కే22లో భాగంగా విద్యార్థులకు ఫుడ్‌ కార్వింగ్, ఈటింగ్‌ కాంపిటీషన్, ప్యాకోడుస్, బ్లైండ్‌ ఫుడ్, ఫైర్‌లెస్‌ కుకింగ్, వ్యాసరచన, క్విజ్, జామ్‌ ( జస్ట్‌ ఏ మినిట్‌), డిబేట్, మోనో యాక్షన్‌ వంటి పోటీలను నిర్వహించారు. అంతేకాకుండా లోగో క్రియేషన్, షార్ట్‌ ఫిల్మ్, ఫుడ్‌ ఫోటోగ్రఫీ. పోస్టర్‌ ప్రజేంటేషన్, బెస్ట్‌ క్యాప్షన్‌ విన్స్, స్టఫ్‌ ద బ్లాంక్, థింక్‌ క్వెస్ట్‌ వంటి పోటీలను కూడా నిర్వహించారు. కార్యక్రమంలో ఆక్వా అండ్‌ స్పైసిస్‌ బిజినెస్‌ హెడ్‌ సంజీవ్‌ బిస్త్, ఫుడ్‌ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రమేష్‌ నాయుడు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...