విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ


 మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఇందుకూరి చంద్రశేఖర్‌ రెడ్డి  అనే విద్యార్థికి తమ యూనివర్సటీ   పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఎఫెక్ట్‌ ఆఫ్‌ గ్రాఫైన్‌ ఆక్సైడ్‌ ఆన్‌ మైక్రోస్ట్రక్చర్, మెకానికల్‌ అండ్‌ డ్యూరబిలిటీ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సిమెంట్‌ కాంపోసైట్‌ మెటీరియల్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌.రూబెన్‌  గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన పరిశోధనలో భాగంగా మొత్తం ఎస్‌సీఐ 4, స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్‌ 2, 4 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన ఇందుకూరి చంద్రశేఖర్‌ రెడ్డిను  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.