నేడు భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పురస్కార ప్రదానోత్సవ సభ

నేడు భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పురస్కార ప్రదానోత్సవ సభ 


- అంబేద్కర్ జయంతి సందర్భంగా జర్నలిస్ట్ కు అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డుల పేరుతో సత్కారం

 - టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా , అషేర్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో 

తెవాలి. భారత రత్న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని మీడియా సంస్థలు టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, స్వచ్ఛంద సేవా సంస్థ ఆషేర్ ఫౌండేషన్ నిర్వహణలో, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వారం స్థానిక పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో ఉత్తమ సేవలందించిన జర్నలిస్ట్ లకు అంబేద్కర్ ఎక్సలెన్సీ పురస్కారాలను ప్రధానం చేయనున్నట్లు నిర్వహకులు కనపర్తి రత్నాకర్ ప్రకటనలో మంగళవారం తెలిపారు. సాంయంత్రం నాలుగు గంటలకు జరగనున్న సభలో ఆతిధులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టినాసురేష్, స్థానిక శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, ఐ అండ్ పిఆర్ జాయింట్ డైరెక్టర్ తేళ్ళ కస్తూరి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. అనిత, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్, డాక్టర్ పి.జె రత్నాకర్ , డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఆకుల అమరయ్య జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయినాల మల్లేశ్వరరావులు పాల్గొంటారన్నారు. పత్రికారంగంలో విశేష సేవలందించిన పాత్రికేయులు తేళ్ళ రవీంద్రబాబు ( సూర్యదినపత్రిక ), ఎస్.ఎస్. జహీర్ (జనత దినపత్రిక) గురిందపల్లి ప్రభాకర రావు ( ప్రజాశక్తి దినపత్రిక), వేజండ్ల గోపి రాజారావు ( జి.టివి). మంచికలపూడి రవికుమార్ ( ప్రజాశక్తి దినపత్రిక ) గుమ్మడి ప్రకాశరావు ( దినపత్రిక )లకు పురస్కారాలను అందించనున్నట్లు శ్రీ శ్రీ మీడియా శ్రీకాంత్, ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్, ఆషేర్ ఫౌండేషన్ నిర్వాహకులు, ఫెడరేషన్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పుట్ల పున్నయ్య లు తెలిపారు.