జర్నలిస్టుకు అంబేద్కర్ ఎక్సలెన్సీ పురస్కారాల ప్రదానం

జర్నలిస్టులకు
 అంబేద్కర్ ఎక్సలెన్సీ పురస్కారాల ప్రదానం


తెనాలి: 14-04-2022: పత్రికారంగం గత 20 సంవత్సరాలుగా విశేష సేవలందిస్తున్న ఆరుగురు జర్నలిస్టులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం తెనాలిలో ఘనంగా జరిగింది.  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, అషేర్ చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో బుధవారం రాత్రి స్థానిక పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎల్టెన్సీ - 2022 పురస్కార ప్రధానోత్సవములో ముఖ్యఅతిధిగా 
గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టినా సురేష్ పాల్గొన్నారు. సభకు కార్యక్రమ నిర్వాహకులు, తెనాలి డివిజన్ ఏపిడబ్ల్యూజెఎఫ్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రత్నాకర్ అధ్యక్షత వహించారు.
హెనీ క్రిస్టినా సురేష్ మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన వృత్తి జర్నలిజం అని, ప్రజలను చైతన్య వంతం చేయడంలో జర్నలిస్టులదే కీలకపాత్ర అన్నారు. అలాంటి జర్నలిస్టులను భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సత్కరించుకోవడం, వారికి అంబేద్కర్ ఎక్సకెన్సీ అవార్డులను అందించి గౌరవించడం అభినందనీయం అన్నారు. జర్నలిస్టుల సమస్యలు తనకు కొంతవరకు తెలుసునని ఆ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కార దిశగా కృషి చేస్తానని ఆమె చెప్పారు. 
 జర్నలిస్ట్ లు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఏఎన్‌యూ డిపార్ట్ మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి. అనిత మాట్లాడుతూ దార్శినికుడైన అంబేద్కర్ ఆశయాలు అందరకీ ఆదర్శమన్నారు. ఏఎన్ యూ జియాలజీ శాఖాధిపతి డాక్టర్ పి.జె. రత్నాకర్ మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ జర్నలిస్ట్ గా చేసిన కృషిని, స్థాపించిన పత్రికల గురించి సవివరంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ నేడు కాలం గతంలోలా లేదని, జర్నలిస్టు ప్రజల పక్షాన ఉంటేనే సమాజానికి న్యాయం జరుగుతుందని అన్నారు. అధ్యక్షత వహించిన రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సౌకర్యాలు, అక్రిడిడేషన్ , హెల్త్ కార్డుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం నుంచి తరగతులను, సిలబస్ ను ఏర్పాటు చేయాలని డాక్టర్ అనితను కోరారు.
కార్యక్రమంలో గుంటూరు జీవిఆర్ అండ్ ఎస్. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డాక్టర్ కనపర్తి అబ్రహాంలింకన్, ఏపీ ఐ అండ్ పిఆర్ జాయింట్ డైరెక్టర్ తేళ్ళ కస్తూరి, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కృష్ణ జిల్లా కన్వీనర్ అబ్దుల్ హలీమ్ ప్రసంగించిన ఈ సభకు ఆయినాల మల్లేశ్వరరావు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తేళ్ళ రవీంద్ర, ఎస్.ఎస్. జహీర్, గురిందపల్లి ప్రభాకరరావు, మంచికలపూడి రవికుమార్, గుమ్మడి ప్రకాశరావు ప్రభృతులకు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఎక్స్ లెన్సీ - 2022 పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ కమిటీకి చెందిన కనపర్తి రత్నాకర్, అంబటి శ్యామ్ సాగర్, పుట్ల పున్నయ్య, మునిపల్లి శ్రీకాంత్ ఫెడరేషన్ నాయకులు, సభ్యులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాత్రికేయులు, పురప్రముఖులు పాల్గొన్నారు.