మాజీ హోం మంత్రి ని కలిసినమంత్రి మేరుగు నాగార్జున


మాజీ హోం మంత్రి ని కలిసిన
మంత్రి మేరుగు నాగార్జున

గుంటూరు, ఏప్రిల్ 16:  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. మేరుగు నాగార్జున హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ను మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడారు. శనివారం గుంటూరు లోని సుచరిత స్వగృహానికి వెళ్లి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన మంత్రివర్గంలో స్థానం సాధించినందుకు నాగార్జున ను సుచరిత అభినందించారు. ప్రజల ఆదరణ పొందేలా పని చేసి మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ, సీఎం జగన్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ భావజాలంతో కొనసాగుతున్న ప్రభుత్వం లో దళిత బహుజనులకు లభిస్తున్న ఆదరణ చారిత్రాత్మమైనదని చెప్పారు. దళితులు అందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెన్నంటి నడవాలని, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందడానికి చేయూతను ఇవ్వాలని నాగార్జున కోరారు.