విజ్ఞాన్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ _పీ.నాగభూషణ్
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ నూతన వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రయాగరాజ్లోని ఐఐఐటీ–అలహాబాద్ డైరక్టర్గా పదవీ బాధ్యతలు నిర్వహించి గుంటూరులోని విజ్ఞాన్స్ యూనివర్సిటీకు 5వ వైస్ చాన్సలర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పదవీ కాలంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానన్నారు. యూనివర్సిటీలో అకడమిక్, రీసెర్చ్, మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తానన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంగా పనిచేస్తానని తెలియజేసారు. ఈయన గతంలో ఐఐటీ–లక్నో మెంటర్ డైరక్టర్గా, యూనివర్సిటీ ఆఫ్ మైసూరుకు చీఫ్ నోడల్ ఆఫీసర్తో పాటు సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీకు డైరక్టర్గా కూడా పనిచేశారు. ఈయన పదవీ కాలంలో ఐఐఐటీ అలహాబాద్లో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేశారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ లింక్డ్ కంటిన్యూస్ అసెస్మెంట్ అండ్ అవార్డ్స్ ఆల్ త్రీ లెవల్స్( పీహెచ్డీ, పీజీ, యూజీ)ను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా సంవత్సరానికి సమ్మర్ సెమిస్టర్ను కలుపుకుని ఇంటర్న్షిప్స్తో కూడిన మూడు సెమిస్టర్లు ఉండాలనే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇతర విద్యాలయాల నుంచి వచ్చే విద్యార్థులకు వీలుగా క్రెడిట్ ట్రాన్స్ఫర్ కోర్సెస్ను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్లర్ ప్రొఫెసర్ కే.రామ్మూర్తినాయుడు, న్యూఢిల్లీలోని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్.దేవరాజ్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సీనియర్ అడ్వైజర్ డాక్టర్ టీఎస్ రావ్, సింగపూర్లోని ఎన్టీయూ ప్రెసిడెంట్స్ ఆఫీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి, హైదరాబాద్లోని యునైటెడ్ హెల్త్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరక్టర్ డాక్టర్ వై.శరత్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.