Skip to main content

విజ్ఞాన్స్‌ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్‌  _పీ.నాగభూషణ్‌
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ నూతన వైస్‌ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రయాగరాజ్‌లోని ఐఐఐటీ–అలహాబాద్‌ డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించి గుంటూరులోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 5వ వైస్‌ చాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పదవీ కాలంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానన్నారు. యూనివర్సిటీలో అకడమిక్, రీసెర్చ్, మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తానన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంగా పనిచేస్తానని తెలియజేసారు. ఈయన గతంలో ఐఐటీ–లక్నో మెంటర్‌ డైరక్టర్‌గా, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూరుకు చీఫ్‌ నోడల్‌ ఆఫీసర్‌తో పాటు సెంటర్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకు డైరక్టర్‌గా కూడా పనిచేశారు. ఈయన పదవీ కాలంలో ఐఐఐటీ అలహాబాద్‌లో హై పర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ అండ్‌ క్లౌడ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ లింక్డ్‌ కంటిన్యూస్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అవార్డ్స్‌ ఆల్‌ త్రీ లెవల్స్‌( పీహెచ్‌డీ, పీజీ, యూజీ)ను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా సంవత్సరానికి సమ్మర్‌ సెమిస్టర్‌ను కలుపుకుని ఇంటర్న్‌షిప్స్‌తో కూడిన మూడు సెమిస్టర్‌లు ఉండాలనే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇతర విద్యాలయాల నుంచి వచ్చే విద్యార్థులకు వీలుగా క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ కోర్సెస్‌ను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.రామ్మూర్తినాయుడు, న్యూఢిల్లీలోని యూజీసీ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ హెచ్‌.దేవరాజ్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌ రెడ్డి, న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ సీనియర్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ టీఎస్‌ రావ్, సింగపూర్‌లోని ఎన్‌టీయూ ప్రెసిడెంట్స్‌ ఆఫీస్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ బీవీఆర్‌ చౌదరి, హైదరాబాద్‌లోని యునైటెడ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ వై.శరత్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...