Skip to main content

98% మంది విజ్ఞాన్స్‌ నిరుల విద్యార్థినులకు ఉద్యోగాలు

98% మంది విజ్ఞాన్స్‌ నిరుల విద్యార్థినులకు ఉద్యోగాలు

స్థానిక పలకలూరులోని విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాలలో  నాలుగో సంవత్సరం చదువుతున్న వారిలో 98% మంది విద్యార్థినులకు ప్రముఖ బహుళజాతి సంస్థలైన టీసీఎస్‌ డిజిటల్, అసెంచర్, ఐబీఎమ్, వర్చూసా, ఇన్ఫోసిస్, విప్రో వంటి బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని విజ్ఞాన్స్‌ నిరుల ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ పాతూరి రాధిక మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ సన్మాన కార్యక్రమనాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఈ సంవత్సరంలో అత్యధికంగా రూ.19 లక్షల వార్షిక ప్యాకేజీతో నాలుగో సంవత్సరానికి చెందిన హేమ స్పందన సత్తా చాటిందన్నారు. అంతేకాకుండా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక వేతనానికి 30 మంది విద్యార్థినులు, రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షిక వేతనానికి 284 మంది విద్యార్థినులు, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వార్షిక వేతనానికి 400 మందికి పైగా విద్యార్థినులు ఎంపికయ్యారని వెల్లడించారు. విభాగాల వారీగా పరిశీలించినట్లైతే సీఎస్‌ఈ విభాగం నుంచి 99% మంది విద్యార్థినులు, ఈసీఈ విభాగం నుంచి 98% మంది విద్యార్థినులు, ఐటీ విభాగం నుంచి 99% మంది విద్యార్థినులు, ఈఈఈ విభాగం నుంచి 97% మంది విద్యార్థినులు ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ తమ కళాశాలలో చదివే విద్యార్థులకు డిగ్రీ పట్టాతో పాటు, కళాశాలలో ఉన్నప్పుడే ఉద్యోగం వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం వల్లే విద్యార్థులు వివిధ బహుళజాతి సంస్థలకు ఎంపికై సత్తాచాటుతున్నారని పేర్కొన్నారు. తమ కళాశాలలో మొదటి సంవత్సరం నుంచి ఇంజినీరింగ్‌ విద్యతో పాటు ప్రత్యేక తరగతులు, మేము అవలంభించే కౌన్సిలింగ్‌ సిస్టం విధానం, ప్రత్యేక ట్రైనింగ్‌ క్లాస్‌లే కారణమని పేర్కొన్నారు. విద్యార్థులను బలవంతంగా, బాధతో చదివించడం కాకుండా.... విద్యార్థులే స్వతహాగా చదువుకునే విధంగా ప్రోత్సాహించటం, ఆలోచన కలిగించటం, జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనే అభిరుచిని కలగజేస్తామన్నారు.   ప్రతి కంపెనీకి కావలసిన నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని... వాటికి అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక, ఉపాధి కల్పనాధికారులు, ఆయా విభాగాల అధిపతులు పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...