Skip to main content

ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ పై పట్టు సాదిస్తే అదిరిపోయే కొలువలు


ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై పట్టు సాధించిన విద్యార్థులు అదిరిపోయే కొలువలు
- యూఎస్‌ఏలోని కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీ రీసెర్చర్‌ సిద్ధార్థ్‌ అంచె

ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై పట్టు సాధించిన విద్యార్థులు అదిరిపోయే కొలువలు సాధించవచ్చునని యూఎస్‌ఏలోని కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీలోని మెషిన్‌ లెర్నింగ్‌ డిపార్ట్‌మెంట్‌ రీసెర్చర్‌ సిద్ధార్థ్‌ అంచె పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘‘ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌’’పై విద్యార్థులకు ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీ రీసెర్చర్‌ సిద్ధార్థ్‌ అంచె మాట్లాడుతూ ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ స్కిల్స్‌పై పట్టు ఉంటేనే మల్టి నేషనల్‌ కంపెనీలు అభ్యర్థుల వైపు చూసే పరిస్థితి ఉందన్నారు. యువత ఈ ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటేనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. హెల్త్‌కేర్, డిజిటల్‌ ఫైనాన్స్, క్యాన్సర్‌ నివారణ, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, లాజిస్టిక్స్‌ మొదలు అన్ని రంగాల్లో మెషిన్‌ లెర్నింగ్‌ అప్లికేషన్స్‌ వినియోగం పెరిగిందన్నారు. అంతర్జాతీయంగా అన్ని వ్యవస్థలను కుదేలు చేసిన కోవిడ్‌ కారణంగా ఆయా రంగాల్లో మందగమనం కొనసాగుతోందన్నారు. అయితే కోవిడ్‌ అనంతర కాలంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం శరవేగంగా పెరిగిందన్నారు. ప్రముఖ కంపెనీలన్నీ తమ ప్రాజెక్టులను నిరంతరం కొనసాగించడానికి ఏఐ సాంకేతికతనే వినియోగిస్తున్నాయని విద్యార్థులకు తెలియజేసారు. విజ్ఞాన్స్‌ లారా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నేజీ మెలాన్‌ యూనివర్సిటీ నందు ‘‘ ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌’’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసుకుని యూఎస్‌ఏలోని మసాచు సెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నందు పోస్ట్‌ డాక్టరేట్‌ పొందిన సిద్ధార్థ్‌ అంచె మా కళాశాలకు వచ్చి విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యూఎస్‌ఏలోని కెర్నీజీ మెలాన్‌ యూనివర్సటీ రీసెర్చర్‌ అమంద కాస్టోన్, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...