విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ విభాగానికి చెందిన గరిగిపాటి రవి కృష్ణ స్వామి అనే విద్యార్థికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ సాడస్ట్, గ్రానైట్‌ ఫిల్లర్‌ రీఎన్‌ఫోర్డ్స్‌ పాలీబెంజోక్సాజైన్‌ కాంపోసైట్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు యూవర్సిటీలోని ఐక్యూఏసీ డీన్‌ డాక్టర్‌  ఎం.రామక్రిష్ణ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 2 ఈఎస్‌సీఐ జర్నల్‌ పబ్లికేషన్, 2 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు.  పీహెచ్‌డీ పట్టా పొందిన గరిగిపాటి రవి కృష్ణ స్వామిని యూనివర్సిటీ ఐక్యూఏసీ డీన్‌ డాక్టర్‌  ఎం.రామక్రిష్ణ, మెకానికల్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎల్‌.సువర్ణరాజు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.