డాక్టర్ సుధారాణి జ్ఞాపకార్థం అన్నదానం

డాక్టర్ సుధారాణి జ్ఞాపకార్థం అన్నదానం

తెనాలి: ఉత్తమ విలువలతో విద్యను బోధించిన అధ్యాపకురాలు, డాక్టర్ జాన్ సుధా రాణి ప్రధమ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను అద్వర్యం లో జరిగిన కార్యక్రమం లో జాన్ సుధా రాణి భర్త రాజశేఖర్, కుమార్తె సంజన కుటుంబ సభ్యులు కనపర్తి డేవిడ్, ధీరజ్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న భక్త బృంద సభ్యులను అభినందించారు. సేవాకార్యక్రమాలను పట్టణ ప్రజలు ప్రోత్సహించాలన్నారు.