విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ


చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దలవై సుధీర్‌బాబు   అనే అధ్యాపకుడికి గుంటూరు పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ద స్టడీ ఆఫ్‌ ద డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ సెంటర్స్‌ ఫర్‌ ప్రమోటింగ్‌ ద మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియమ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ – ఎ కంపారిటివ్‌ అనాలసిస్‌ ఆఫ్‌ ద సెలెక్టెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు ఇథియోపియాలోని భూల్‌ హోరా యూనివర్సిటీలోని ప్రొఫెసర్‌ బీకే. సూర్యప్రకాష్‌రావు గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన పరిశోధనలో భాగంగా మొత్తం 2 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్లు, 1 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్‌ పబ్లిష్‌ చేశారని తెలియజేసారు.