విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎంవీ రాజు  అనే అధ్యాపకుడికి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఏ స్టడీ ఆన్‌ ద క్యారక్టెరిస్టిక్స్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సాయిల్స్‌ ఆఫ్‌ గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా విత్‌ స్పెషల్‌ రెఫరెన్స్‌ టు రైస్, కాటన్‌ అండ్‌ టొబాకో క్రాప్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు ఆంధ్ర యూనివర్సిటీలోని  ఎన్విరాన్‌మెంట్‌ హానరరీ ప్రొఫెసర్‌ పెద్దినేని ప్రసాద్‌రావు  గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన పరిశోధనలో భాగంగా మొత్తం ఎస్‌సీఐ 2, స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్‌ 2, 4 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన ఎంవీ రాజును  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.