గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 
పాఠకులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని
 రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు అన్నారు.
శనివారం సాయంత్రం తెనాలి శాఖాగ్రంథాలయాన్ని ఆయన
ఆకస్మిక తనిఖీ చేసారు. గ్రంథాలయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తపరచారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రంథాలయాలకు అవసరమేర సదుపాయాలు కల్పిస్తుందన్నారు. పాఠకులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.
కార్యక్రమంలో గ్రంథాలయాల కార్యదర్శి పీర్ అహ్మద్,  గ్రంథాలయ అధికారి ఝాన్సీ,
సిబ్బంది పాల్గొన్నారు,