Skip to main content

మహా దార్శనికుడు పి.విఘనంగా 101 వ జయంతి వేడుకలు

మహా దార్శనికుడు పి.వి

ఘనంగా 101 వ జయంతి వేడుకలు

పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ

పాత పోస్ట్ ఆఫీస్.. జూన్ 28..

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం 
కృషి చేయడంతో పాటు భూసంస్కరణలు అమలు చేసిన మహా దార్శనికుడు పీవీ నరసింహారావు అని పలువురు
ప్రముఖులు  కొనియాడారు.. పాతనగరంలోని వివేకానంద అనాధ, వృద్ధుల ఆశ్రమంలో మంగళవారం పీవీ నరసింహారావు 101 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పీవీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  సంఘ సేవకులు,, ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్  మాట్లాడుతూ
దేశం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పివి మెరుగైన పరిపాలన అందించారన్నారు, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి తన వంతు కృషి చేశారని , ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించిన ఘనత ఆయన సొంతం అన్నారు. దక్షిణ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 
ద్రోణము రాజు శ్రీ వాత్సవ మాట్లాడుతూ తమ తాత 
ద్రోనము రాజు సత్యనారాయణ  ద్వారా పీవీ నరసింహారావు ను కలుసుకోవడం తన జీవితంలో గొప్ప మధురానుభూతి గా పేర్కొన్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన పివి నేటి తరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు 
 సభాద్యక్షులు.. పీవీ చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు , అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు  మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా క్రమం తప్పకుండా పీవీ జయంతి, వర్ధంతి వేడుకలు ఈ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్నామన్నారు,, త్వరలోనే  పలు సేవా కార్యక్రమాలు నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నామన్నా రు.
ట్రస్ట్ చైర్మన్ కె వి శర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తామని, బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు,, తద్వారా నిరుపేదలకు సేవలు అందించాలన్నదే తన సంకల్పంగా పేర్కొన్నారు, తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు,,
, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ నేటితరం పాలకులకు పివి ఆదర్శనీయుడన్నారు.
ఇప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు వల్ల ఎంతో మంది ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.
ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అధ్యక్షులు పి నారాయణ మాట్లాడుతూ పీవీ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
చేపట్టడం అభినందనీయమన్నారు.. తమను కూడా భాగస్వామిని చేసినందుకు సంస్థ నిర్వాహకులు కె వి శర్మ ను అభినందించారు.. ఈ సందర్భంగా నిరుపేదలకు, అన్నదానం వస్త్రదానం,
పుస్తకాలు వితరణ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ఈ కార్యక్రమంలో వైసిపి మహిళా నేత పీలా వెంకట లక్ష్మి, కమల్ బెఇడ్, రాఘవేంద్ర మిశ్రా, రాఘవేంద్ర మిశ్రా
సీనియర్ పాత్రికేయులు జాతీయ కార్యవర్గ సభ్యులు బ్రహ్మా నందం, జి శ్రీనివాసరావు,  పి రవిశంకర్
విశ్వేశ్వరరావు ఈశ్వరరావు తదితరులంతా పాల్గొనగా వివేకానంద సంస్థ అధ్యక్షులు
 సూరాడ అప్పారావుపలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...