విజ్ఞాన్ ప్రవేశపరీక్ష వీశాట్–2022 ఫేజ్–1 ఫలితాలు విడుదల
విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్
జూన్ 9 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం
విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చరల్ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్–2022 ఫేజ్–1 (విజ్ఞాన్ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్)కు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించిందని విజ్ఞాన్స్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. వీశాట్–2022 ఫేజ్–1 ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ వీశాట్–2022 ఫేజ్–1 ప్రవేశ పరీక్షను ఈ సంవత్సరం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారానే నిర్వహించామన్నారు. ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వీశాట్కు హాజరైనట్లు చెప్పారు. 90 శాతానికిపైగా విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం, పరిశోధనల్లో సత్తా చాటుతుండటంలాంటì అరుదైన విజయాంశాల వల్లనే విద్యార్థులు, తల్లిదండ్రులకు తమ యూనివర్సిటీపై ఆదరణ మరింత పెరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. వీశాట్–2022 ర్యాంకులతో పాటు జేఈఈ మెయిన్స్ ఫలితాలు, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్మీడియట్ మార్కులను కూడా పరిగణలోనికి తీసుకుంటామని పేర్కొన్నారు. వీశాట్లో 1 నుంచి 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 75% స్కాలర్షిప్, 100 నుంచి 200లోపు ర్యాంకులు సాధించిన వారికి 50% స్కాలర్షిప్, 201 నుంచి 400లోపు ర్యాంకులు సాధించిన వారికి 25% స్కాలర్షిప్, 401 నుంచి 2000లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 10% స్కాలర్షిప్ను నాలుగు సంవత్సరాల పాటు అందజేస్తామని వెల్లడించారు. ఈ నెల 9వ తారీఖు నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్ ప్రవేశాల కౌన్సిలింగ్ను ప్రారంభిస్తున్నామని తెలియజేసారు. వీశాట్ ఫేజ్–2 ప్రవేశ పరీక్షలను జూన్ 10 నుంచి 31వ తారీఖు వరకు నిర్వహించనున్నామని వెల్లడించారు.
తొలి పది ర్యాంకులు వీరికే...
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డీన్ అడ్మిషన్స్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ వీశాట్లో తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. వీశాట్–2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్ www.vignan.ac.in కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే విద్యార్థుల సెల్ఫోన్లకు ర్యాంకులు వివరాలను పంపిస్తామని తెలియజేసారు. వివరాలకు 7799 427 427, టోల్ఫ్రీ నంబర్ 1800 425 2529లో సంప్రదించవచ్చునని వివరించారు.
1.కోడూరి అన్విత (తూర్పు గోదావరి)
2.కొప్పిశెట్టి సురాక్షయ్ ( తూర్పు గోదావరి)
3.చిలక పర్ధేందర్ (కొవ్వూరు, పశ్చిమ గోదావరి)
4.గుత్స వర్షిణి ( వడ్డివాడ, శ్రీకాకుళం)
5.మారీడు భారతివర్ష ( క్రిష్ణా జిల్లా)
6.సౌరవ్ ఠాకూర్ ( నార్త్ బెంగాల్)
7.అడప సూర్యలక్ష్మీదేవి సంతోషిని (కోరుకొండ, తూర్పు గోదావరి)
8.బండి సూర్యశ్రీజ ( రాజమహేంద్రవరం)
9.సైదా ఫాతిమా హసన్ ( షేక్పేట, హైదరాబాద్)
10.వస్కూరి అనూహ్య లక్ష్మి ( పాలకొల్లు, పశ్చిమ గోదావరి)
ప్రపంచస్థాయి వసతులు
విజ్ఞాన్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీ విద్యార్థులను ప్రపంచస్థాయి నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టీసీఎస్లతో తమకు అంశాల వారీగా ప్రత్యేక అవగాహన ఒప్పందాలు ఉన్నాయన్నారు. అంతర్జాతీయ యూనివర్సిటీలతో పరస్పర ఒప్పందాలు ఉండటం వల్ల తమ విద్యార్థులను అంతర్జాతీయ పోటీకి ధీటుగా తయారుచేస్తున్నామని తెలిపారు. అందుకే తమ విద్యార్థులు అంతర్జాతీయ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో డీన్ అడ్మిషన్స్, ఐటీ సర్వీసెస్ డీన్ డాక్టర్ కేవీ క్రిష్ణకిషోర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మీడియా విభాగాధిపతి ఏ.గౌరిశంకర్ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.