విజ్ఞాన్స్లో విరాట పర్వం సినిమా యూనిట్ సందడి
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సోమవారం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో నిర్మించిన ‘‘ విరాట పర్వం’’ సినిమా యూనిట్ సందడి చేసింది. రాణా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి హీరో హీరోయిన్లుగా, వేణు ఉడుగుల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా సురేష్ బొబ్బిలి, డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ డాని సంచేజ్ లోఫెజ్, దివాకర్ మణి, ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ పనిచేశారు. హీరో దగ్గుబాటి రాణా చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విరాట పర్వం చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందన్నారు. సినిమాలో ఎమోషన్స్, డ్రామా, ఫైట్స్ తప్పకుండా అందరికీ నచ్చుతాయన్నారు. హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే వైవిధ్యభరితమైనదని తెలియజేసారు. అనంతరం సినిమా యూనిట్ విద్యార్థులతో సెల్ఫీలు దిగారు.