Skip to main content

విజ్ఞాన్స్‌లో ముగిసిన ఉచిత టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌

విజ్ఞాన్స్‌లో ముగిసిన ఉచిత టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో 40 రోజుల పాటు జరిగిన ఉచిత విద్యావాలంటీర్స్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ముగిసిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవారయలు ఎంపీగా ఉన్న నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని బొల్లాపల్లి, మాచవరం, వెల్దర్తి మండలాలకు చెందిన 53 మంది గిరిజిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉచిత టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించామన్నారు. నేటితో శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న వీరందరూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారి సొంత గ్రామాల్లో విద్యా వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తూ నెలకు రూ.8000 వేతనం అందుకోనున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలోని విద్యార్థులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌ మీడియంలో బలోపేతం చేయడానికి వీరు కృషి చేయాలన్నారు. అంతేకాకుండా మీ పరిసర గ్రామాల్లోని విద్యార్థులు డ్రాప్‌ అవుట్స్‌ అవ్వకుండా చూసుకోవాలన్నారు. వీరికి ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీలైన టీసీఎస్, సింక్రోని, ఏపీటీ ఆన్‌లైన్‌ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో నెలనెలా ఉపకార వేతనాన్ని ఇవ్వనున్నారని తెలియజేసారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవారయలు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించి వారిని అభివృద్ధి పథంలో నడపాలనే సదుద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 40 రోజులపాటు జరిగిన శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను వారి గ్రామాల్లో సమర్ధవంతంగా నిర్వహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌లను అందజేసారు. ఈ 40 రోజుల కార్యక్రమానికి జాయింట్‌ డీన్‌ ఫ్యాకల్టీ అఫైర్స్‌ ప్రొఫెసర్‌ అల్లంనేని శారద డైరక్టర్‌గాను, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నాగేంద్రరావు హౌజి, డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ చవాన్‌లు కోఆర్డినేటర్‌లుగా వ్యవహరించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...