Skip to main content

నటులుగా రాణించడానికి సరైన మార్గం రంగస్థలం

నటులుగా రాణించడానికి సరైన మార్గం రంగస్థలం 

- సినీ టీవీ నటి,దర్శకురాలు డా.శ్రీజ సాదినేని

లక్ష్యం ఉన్నతంగా ఉంటే సరిపోదు, అందుకు ప్రణాళిక కూడా సరిగ్గా వేసుకుంటేనే లక్ష్య సాధన సాధ్యం అవుతుంది అని ప్రముఖ సినీ నటి,రచయిత్రి,దర్శకురాలు డా శ్రీజ సాదినేని తెలిపారు.
హైదరాబాద్ బంజారా హిల్స్ లోని లమాకాన్ లో శనివారం రాత్రి శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ సమర్పణలో, డా.శ్రీజ సాదినేని దర్శకత్వం వహించిన  " పద్మవ్యూహం " నాటిక ప్రదర్శించారు.
ఈ సందర్భంగా డా.శ్రీజ మీడియాతో ముచ్చటించారు.ప్రముఖ సినీ రచయిత, నటులు, దర్శకులు శ్రీ ఎల్.బి.శ్రీరామ్ రచించిన పద్మవ్యూహం నాటిక సగటు మనిషి సమస్యల్ని కష్టాల్ని సామాజిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తోంది. ఈ నాటికలో పది పాత్రలు ఉంటే వాటిని కేవలం ముగ్గురు ఆర్టిస్టులు మాత్రమే పోషించడం ఈ నాటిక ప్రత్యేకత అని డా.శ్రీజ అన్నారు.సినీ పరిశ్రమలో నటులుగా కొనసాగాలని ఎంతోమంది ఆశ పడుతుంటారని అయితే సరైన మార్గం తెలియక సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, సమయాన్ని,డబ్బుని వృధా చేసుకుంటున్నారని, అటువంటి వారు రంగస్థల నటనలో శిక్షణ తీసుకుంటే నటులుగా ఉన్నత శిఖరాలు అందుకుంటారని  ఆమె అన్నారు.యువత రంగస్థలంలో తమ ప్రతిభా పాటవాలు మెరుగు పరుచుకుంటే సినీ టీవీ రంగాలలో కూడా రాణించే అవకాశం పుష్కలంగా ఉందని, అందుకు సరైన మార్గం రంగస్థలమే అని, అందుకే నటులుగా ఎదగాలని కోరుకునే యువతకు వర్క్ షాప్ లతో శిక్షణ ఇచ్చి, ఇలాంటి ప్రదర్శనలు ఇప్పించి, వారిని నటులుగా తీర్చి దిద్దుతున్నామని,జూన్ 20నుండి మరో యాక్టింగ్ వర్క్ షాప్ ప్రారంభిస్తున్నామని, ఆసక్తి కలిగిన వారు 9949910366 నెంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చు అని  డా.శ్రీజ సాదినేని యువతకు ఆహ్వానం పలికారు. 
ఈరోజు కూడా పద్మవ్యూహం నాటిక ప్రదర్శన లమాకాన్ లో ప్రదర్శిస్తున్నామని, నాటక, కళా ప్రియులు అందరూ వచ్చి తమ కళాకారులను ఆశీర్వదించాలని డా.శ్రీజ కోరారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...