ఇంటర్ ఫలితాల్లో ‘‘విజ్ఞాన్’’ విజయభేరి
ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ జే.మోహనరావు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విద్యా శాఖ విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు ఏ.హేమలత (984), జీ.యశ్వంత్ (982), కే.హర్షవర్ధన్ (982), ఎండీ సుభానీ(981), పీ.శివతేజ (980) మార్కులు సాధించారన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో ఎం.కవిత (466), ఆర్.శివకుమార్ (464), డీ.నీరజ్బాబు (464), కే.హెచ్. వర్ధన్ చౌదరీ(464), జీ.జితేంద్ర మోహన్ (463), డీ.రమేష్ (463), కేఎన్ఎన్ఎంహెచ్ శశాంక్ (463) మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 450కు పైగా మార్కులు 100 మంది సాధించారని పేర్కొన్నారు. రెండో సంవత్సరం విద్యార్థుల్లో 970కి పైగా మార్కులు 50 మంది సాధించారని తెలియజేసారు. అద్భత ఫలితాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో వడ్లమూడి, గుంటూరు జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ జే.మోహనరావు, వై. వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.