Skip to main content

జర్నలిస్టుల సమస్యలపై ఏపీ డబ్ల్యూజేఎఫ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన

జర్నలిస్టుల సమస్యలపై ఏపీ డబ్ల్యూజేఎఫ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన
విశాఖపట్నం, జూన్ 27, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్లు సంయుక్తంగా సోమవారం విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టాయి. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, వృత్తి పన్ను రద్దు చేయాలని,ఇళ్ల స్థలాలు కేటాయించాలని,విశాఖపట్నంలో 1996 మరియు 2009లో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల సమస్యను సత్వరం పరిష్కరించాలని,మీడియా అకాడమీ ఏర్పాటు చేయాలని, పెన్షన్ పథకం,ఆరోగ్య భీమా అమలు చేయాలని, జర్నలిస్టులకు అవార్డులు ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ గత మూడు ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని,అక్రిడేషన్లు విషయంలో అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తపరిచారు.ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కొత్తగా వృత్తి పన్ను ప్రతి జర్నలిస్టు 2500 రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. చాలీచాలని జీతాలు,అంతంతమాత్రంగా ఉన్న ఉద్యోగాలతో కాలం గడుపుతున్న జర్నలిస్టులు వృత్తి పన్ను చెల్లింపు దుర్లభమని అన్నారు.జాతీయ జర్నలిస్టుల సంఘం  కార్యదర్శి గంట్ల శ్రీనువ్
బాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఆరోగ్య బీమా ఇళ్ల స్థలాలు కేటాయించాలని వృత్తి పన్ను మినహాయించాలని కోరారు,ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 
మహా విశాఖ నగర శాఖ అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్,కార్యదర్శి ఎస్  అనురాధ, బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు,ఇతర నాయకులు శివ ప్రసాద్, జి. శ్రీనివాసరావు,దాడి రవికుమార్, వై. రామకృష్ణ,ఎన్.రామకృష్ణ, ఎమ్మెస్సార్ ప్రసాద్,చింతా ప్రభాకరరావు,ఎం.ఎ. ఎన్. పాత్రుడు,శివరాం, కె. వి. శర్మ,,నగేష్ ఎన్. బ్రహ్మానందం, సుధాకర్ , కామన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ కు వినతిపత్రం సమర్పించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...