Skip to main content

ఎన్ఠీఆర్ శతజయంతి ఉత్సవాల్లో దర్శకుడు రత్నాకర్ కు సత్కారం

ఎన్ఠీఆర్  శతజయంతి ఉత్సవాల్లో దర్శకుడు రత్నాకర్ కు సత్కారం

తెనాలి: శకపురుషుడు ఎన్ఠీఆర్ శతజయంతి మహోత్సవాల్లో భాగం గా మాజీ మంత్రి  ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరుగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలలో మంగళవారం *మన దేశం* చిత్రం  ప్రదర్శించారు. శత జయంతి సత్కారాల పండుగ* (రోజుకొక కళాకారునికి సత్కారం) కార్యక్రమంలో భాగంగా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్  తెనాలి డివిజన్ ప్రధాన కార్యదర్శి, సమాచార హక్కు సంఘం జిల్లా కార్యదర్శి, రచయిత, దర్శకుడు, కళా దర్శకుడు, వరల్డ్ రికార్డ్ హోల్డర్   కనపర్తి రత్నాకర్ ను శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు సత్కరించారు.  గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నాదుల మహేష్, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొబ్బిల్లపాటి ప్రసాద్ లు ఘనంగా సత్కరించి రత్నాకర్ కళా సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లవరపు విజయ్, కుదరవల్లి శ్రీనివాస్, పెమ్మసాని పోతురాజు, పెసరలంక గోపి, మునిపల్లి శ్రీకాంత్, ఎన్టీఆర్ జగన్, మాలకొండమ రాజు, ముప్పానేని రాఘవరావు, నల్లూరి శ్రీనివాస్, డా.అయినాలమల్లేశ్వరరావు, కొరియోగ్రాఫర్ అమ్మ సుధీర్ మాస్టర్, నటుడు, న్యాయవాది కనపర్తి మధుకర్,  దేవరపల్లి భవాని,  పెసర్లంక గోపి, రమేష్ పాత్రికేయులు టి. రవీంద్ర, జీ. ప్రకాశరావు, ప్రేమ్ కుమార్, పి. పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో బుధవారం పల్లెటూరు చిత్ర ప్రదర్శనవుంటుందన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...