Skip to main content

Posts

Showing posts from July, 2022

విజ్ఞాన్‌లో ఘనంగా లావు రత్తయ్య పుట్టినరోజు వేడుకలు

విజ్ఞాన్‌లో ఘనంగా లావు రత్తయ్య పుట్టినరోజు వేడుకలు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో గురువారం విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య 71వ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు మాత్రమే తారతమ్య భేధాలు లేకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారని అన్నారు. విద్యార్థులందరూ జీవితంలో బాగా ఎదిగి మంచి లీడర్లు అయినప్పుడు తాను ఇంకా ఎక్కువ సంతోషిస్తామని తెలియజేశారు. విద్యార్థులతో తనకున్న అనుబం«ధం మాటల్లో వర్ణించలేనిదని, అందుకోసమే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును విద్యార్థుల మధ్య జరుపుకోవడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. సాధారణ ఆలోచనలతో కాకుండా క్రియేటివ్‌గా ఆలోచిస్తేనే విజయం సాధించగలరని విద్యార్థులకు సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే విద్యార్థులు సరైన దిశగా ఎదగలగరనే సిద్ధాంతాన్ని తాను మొదటి నుంచి నమ్ముతున్నానని చెప్పారు. అదే సూత్రాన్ని తాము ప్రతి పాఠశాల, కళాశాలల్లో అమలు చేస్తున్నామని తెలిపారు.  కాబట్టే తమ విద్యార్థులు ఎన్నో అద్భుతాలు చేయగలుగుతున్నారని పేర్కొన్నా...

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి వర్క్‌షాప్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి వర్క్‌షాప్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డివిజన్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి వర్క్‌షాప్‌ కోర్సును బుధవారం నుంచి ప్రారంభించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఏ వైడ్‌ గముత్‌ ఆఫ్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ టెక్నిక్స్‌ ఇన్‌ కెమిస్ట్రీ’’ అనే అంశంపై ఈ కోర్సును ప్రారంభించామన్నారు. ఈ వర్క్‌షాప్‌ను డీఎస్టీ– సెర్బ్‌ ఇనిషియేటివ్‌ అభ్యాస్‌ స్కీమ్‌ కింద నిర్వహిస్తున్నామని తెలియజేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెంగుళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ గౌతమ్‌ దేసిరాజు మాట్లాడతూ విద్యార్థులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన విద్యా విధానం ఉండాలని తెలిపారు. ప్రస్తుతం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వస్తున్న నూతన ఆవిష్కరణలు సమాజాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఉన్న...

సరైన గురువుల శిక్షణ వల్లే స్వర్ణ పతకం దక్కింది

సరైన గురువుల శిక్షణ వల్లే స్వర్ణ పతకం   - సినీ టీవీ నటి, రచయిత్రి డా.శ్రీజ సాదినేని హైదరాబాద్: గురువులు దొరికితే స్వర్ణ పతకం మాత్రమే కాదు ఏదైనా సాధించ వచ్చు అన్నారు సినీ టీవీ నటి, రచయిత్రి డా శ్రీజ సాదినేని. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన 15వ స్నాతకోత్సవంలో 2017-19 సం.కి గానూ రంగస్థల కళల శాఖలో గోల్డ్ మెడల్ అందుకున్న సందర్భంగా డా శ్రీజ మీడియాతో ముచ్చటించారు.  ద్రోణాచార్యుడి వంటి గురువు వల్లనే అర్జునుడు గొప్ప విలుకాడుగా పేరు గాంచాడు. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. మంచి గురువు దొరికితే విద్య నేర్చుకోవాలి అనుకునే ప్రతి విద్యార్థీ  అత్యున్నత శిఖరాలను అందుకుంటారన్నారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో డా.పద్మప్రియ, డా.కోట్ల హనుమంతరావు, కళ్యాణి, ణి, మల్లాది గోపాలకృష్ణ, రాయల హరిశ్చంద్ర,, ఆంటోనీ రాజ్ వంటి మంచి మంచి గురువులు ఉండబట్టే  థియరీ, ప్రాక్టికల్స్ అన్నిట్లోనూ ఉత్తీర్ణత సాధించి స్వర్ణ పతకం పొందగలిగానని తన గురువులకు పాదాభివందనాలతెలుపుకుంటున్నాను అని తన గురుభక్తిని చాటుకున్నారు. యాక్టింగ్,యాంకరింగ్,న్యూస్ రీడింగ్, డబ్...

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో విజ్ఞాన్స్‌కు 95వ ర్యాంకు

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో విజ్ఞాన్స్‌కు 95వ ర్యాంకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ( ఎంహెచ్‌ఆర్‌డీ) శుక్రవారం విడుదల చేసిన ఉన్నతస్థాయి విద్యాసంస్థల ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ర్యాంకులలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయస్థాయిలో 95వ ర్యాంకు లభించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 95వ ర్యాంకు లభించిందన్నారు. అదే విధంగా ఇంజినీరింగ్‌ విభాగంలో కూడా 99వ ర్యాంకు సాధించినట్లు తెలియజేసారు. టీచింగ్‌ లెర్నింగ్‌ రిసోర్సెస్, రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్‌ ఔట్‌కమ్స్, ఔట్‌రీచ్‌ అండ్‌ ఇంక్లూజివిటీ, పీఆర్‌ పర్‌సెప్షన్‌ కేటగిరీల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పనితీరును కేంద్రం పరిశీలించి 100 పాయింట్ల స్కోర్‌ ప్రామాణికంగా ఈ ర్యాంకులను కేటాయించిందన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు లభించడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ ఏజెన్సీల నుంచి గ్రాంట్లు అం...

మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే సర్వీస్‌ సాధ్యమే

మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే సర్వీస్‌ సాధ్యమే   ఆలిండియా సివిల్స్‌ 37వ ర్యాంకర్, ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 3వ ర్యాంకర్‌ వి.సంజన సింహా సివిల్స్‌లో సత్తాచాటాలనుకునే విద్యార్థులు  ఏడాది పాటు చదివి పరీక్షలో విజయం సాధించకపోతే.... నిరాశ చెందకూడదని, ఓర్పు, సహనంతో మళ్లీ మళ్లీ ప్రయత్నించి సర్వీస్‌ సాధించాలని ఆలిండియా సివిల్స్‌ 37వ ర్యాంకర్, ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 3వ ర్యాంకర్‌ వి.సంజన సింహా విద్యార్థులకు పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని సివిల్స్‌ సర్వీసెస్‌ అకడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘‘సివిల్స్‌ పరీక్షను ఎలా అధిగమించవచ్చు?’’ అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది సివిల్స్‌ ర్యాంకర్‌ వీ.సంజన సింహా మాట్లాడుతూ పాత ప్రశ్నాపత్రాలను బాగా ప్రాక్టీస్‌ చేయడం వలన ప్రశ్నల సరళి ఏ విధంగా అడుగుతున్నారో అర్థమవుతుందన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎలా ప్రిపేర్‌ అవ్వాలో తెలియాలంటే మాత్రం నిపుణుల గైడెన్స్‌ తీసుకోవాలన్నారు. సివిల్స్‌ పరీక్షలో మెరవాలంటే శ్రమ, శ్రద్ధ, అంకితభావం, సొంత ప్రతిభతోనే రాణించగలరని పేర్కొన్నారు. సివిల్స్‌ ప్రిపేర్‌ అయ్యే ...

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో సమాచారం భద్రం

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో సమాచారం భద్రం   కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ   విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–2కే22 ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో సమాచారానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో అడ్డుకట్టవేయవచ్చని కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్, చెన్నై రీజియన్‌లోని సీఎస్‌ఐ స్టూడెంట్‌ చాప్టర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఫ్యూచరిస్టిక్‌ ఐడియాస్‌ ఫర్‌ ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌ ’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–2కే22ను ఘనంగా ప్రారంభించారు. కాన్‌క్లేవ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ మాట్లాడుతూ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సహాయంతో ప్రభుత్వ పాలనకు సంబంధించి భూ రికార్డులు ట్యాంపరింగ్‌ జరగకుండా భద్రపరచవచ్చునన్నారు. బ్యాంక్‌ లావాద...

8 నుంచి విజ్ఞాన్స్‌లో జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–22

8 నుంచి విజ్ఞాన్స్‌లో జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–22 చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఈ నెల 8 నుంచి రెండు రోజుల పాటు జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–2కే22ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘‘రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–2కే22’’ బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీలోని కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్, చెన్నై రీజియన్‌లోని సీఎస్‌ఐ స్టూడెంట్‌ చాప్టర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ఎక్స్‌చేంజింగ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఐడియాస్‌ ఫర్‌ ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌ ’’ అనే అంశంపై రెండు రోజుల పాటు  కాన్‌క్లేవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ, ఐఐటీ మండి ఫౌండర్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ తిమోథీ ఏ.గాన్‌సాల్వ్స్, ఐఐటీ మద్రాస్‌లోని కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ సీ.చంద్రశేఖర్, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌లోని కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ డీ.ఎస్‌.గుర...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయస్థాయి పేటెంట్‌ మంజూరయ్యిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని కేఆర్‌ మంగళం యూనివర్సిటీ ప్రో వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ అవిరేని శ్రీనివాసులు, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ ముసల శారదల సంయుక్త గైడ్‌ల ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పోసాని విజయలక్ష్మి ప్రతిపాదించిన ‘‘ ఏ నావల్‌ హై స్పీడ్‌ లో పవర్‌ త్రీ ఇన్‌పుట్‌ స్టాటిక్‌ సీఎమ్‌వోఎస్‌ ఎక్స్‌క్లూజివ్‌– ఆర్‌ లాజిక్‌ గేట్‌ సర్కూట్‌’’ అనే అంశానికి ప్రముఖ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఇండియా అథారిటీ పేటెంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. వీరు ప్రతిపాదించిన ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌ను బేసిక్‌ ఎలిమెంట్‌గా వినియోగించి అతి తక్కువ స్పేస్, పవర్‌ గల హైస్పీడ్‌ ప్రాససర్‌లను తయారుచేయచ్చు. వీళ్లకు ఈ పేటెంట్‌పై 20 సంవత్సరాల పాటు హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ...

విజ్ఞాన్స్‌ విద్యార్థినికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థినికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సీఎస్‌ఈ విభాగానికి చెందిన సజ్జా తులసి క్రిష్ణ అనే విద్యార్థినికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇమేజ్‌ ఐడింటిఫికేషన్‌ ఆన్‌ లార్జ్‌ డేటా యూజింగ్‌ ఆప్టిమైజ్డ్‌ డీప్‌ లెర్నింగ్‌ టెక్నిక్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారన్నారు. ఈమెకు యూనివర్సిటీలోని సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ హేమంత కుమార్‌ కల్లూరి గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 2 ఎస్‌సీఐ జర్నల్‌ పబ్లికేషన్స్, 2 స్కూపస్‌ పబ్లికేషన్స్‌ మరియు 2 కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియచేశారు.